యాప్నగరం

బతికున్న చేపను నోట్లో పెట్టుకున్నాడు.. అంతలోనే ఘోరం!

గాలానికి చిక్కిన చేపను తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. గాలానికి మరో ఎరను గుచ్చుతున్న సమయంలో.. నోట్లో ఉన్నా ఆ చేప పిల్ల..

Samayam Telugu 16 Apr 2020, 7:46 pm
లాక్‌డౌన్‌లో ఇంట్లోనే ఉండాలని పోలీసులు ఆదేశించినా యువకులు మాట వినడం లేదు. స్నేహితులతో కలిసి బయటకు తిరిగేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన ఓ యువకుడు చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి ఊహించని రీతిలో చనిపోయాడు. తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచాడు.
Samayam Telugu fish-4342143_1280


కీలమలైకు చెందిన హరికంఠన్ (18) తన స్నేహితులతో కలిసి మేల్ అరుంగునం చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చెరువులో వేసిన గాలానికి చిక్కుకున్న చేపను తీసి పక్కన పెట్టడానికి బదులు నోటితో పట్టుకున్నాడు. గాలానికి ఎరను గుచ్చుతుండగా.. నోట్లో ఉన్న ఆ చేప అతడి గొంతులోకి జారుకుంది. దీంతో హరికంఠన్ ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరయ్యాడు. దీంతో అతడి స్నేహితులు హుటాహుటిన ముండియం బాక్కం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు గొంతులో చిక్కుకున్న చేపని బయటకు తీశారు. కానీ, హరికంఠన్ ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

Also Read: వయాగ్రాకు ఆ శక్తి ఉందా? ‘కరోనా’ పరిశోధకుల్లో కొత్త ఆశలు, త్వరలో గుడ్‌న్యూస్?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.