యాప్నగరం

ఆ కప్పలకు నాడు పెళ్లి చేశారు.. నేడు విడాకులిచ్చారు, కారణం ఇదేనట!

వర్షాల కోసం కప్పలకు పెళ్లి చేయడం చూశాం. కానీ, ఆ కప్పలకు విడాకులు ఇవ్వడం ఎప్పుడైనా చూశారా? ఇదిగో ఈ వీడియోలో చూడండి.

Samayam Telugu 14 Sep 2019, 8:36 pm
టీవల వరుణుడి కరుణ కోసం మధ్యప్రదేశ్‌లోని భూపాల్‌లో రెండు కప్పలకు పెళ్లి చేశారు. ప్రస్తుతం వాటి సంసారం బాగానే సాగుతోంది. కానీ, ప్రజలకు మాత్రం అది నచ్చలేదు. అందుకే.. వాటికి విడాకులు ఇచ్చేశారు. ఇందుకు వాళ్లు విచిత్రమైన కారణం చెప్పారు. కప్పలకు పెళ్లి చేయడం వల్ల వర్షాలైతే బాగానే కురిశాయట. కానీ, ఆ తర్వాత కష్టాలు వచ్చాయట.
Samayam Telugu -


Read also: మగ పిల్లలే టార్గెట్.. 33 మందిని రేప్ చేసి చంపేసి, తన గదిలోనే పూడ్చేసిన జోకర్!

మధ్యప్రదేశ్ మహిళా, శిశుసంక్షేమ శాక మంత్రి లిలితా యాదవ్ ఆధ్వర్యంలో గతేడాది కప్పలకు పెళ్లి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కప్పలకు పెళ్లి చేయడమనేది సాంప్రదాయమేనని, మూఢ నమ్మకం కాదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ‘అశద్ ఉత్సవ్’ పేరుతో కప్పలకు పెళ్లి చేశారు. ఈ వేడుకలో మంత్రి లిలితా యాదవ్‌తోపాటు బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడ, మగ కప్పలకు ఘనంగా పెళ్లి చేశారు.
కప్పలకు పెళ్లి చేసిన తర్వాత అక్కడ వర్షాలైతే బాగానే కురిశాయి. దీంతో మధ్యప్రదేశ్‌ను వరదలు ముంచెత్తాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ఆ కప్పలకు విడాకులు ఇవ్వాల్సిందేనని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆ కప్పలను ఓ ఆలయానికి తీసుకెళ్లి వేద మంత్రాల మధ్య విడదీశారు. ఇప్పుడు తప్పకుండా వరదలు తగ్గి ప్రజలు కష్టాలు తీరతాయని భావిస్తున్నారు. బహుశా ప్రపంచంలో కప్పలకు విడాకులు ఇవ్వడం ఇదే తొలిసారి ఏమో కదూ. దీనిపై మీరేమంటారు?

Read also: తల్లిని చంపేసిన రెండేళ్ల చిన్నారి.. ఆ స్విచ్చే కొంపముంచింది

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.