యాప్నగరం

ఫ్రీగా పెళ్లి భోజనం ఆరగించడానికి వెళ్లి.. వరుడిని చంపేసిన అపరిచితులు

వధువరులు పరిచయం లేకున్నా.. పెళ్లి భోజనం తినేందుకు పిలవని పేరంటానికి వెళ్లారు. చిన్న కారణానికే వరుడిని హత్య చేశారు.

Samayam Telugu 20 Dec 2019, 1:52 pm
పెళ్లి భోజనాలు అనగానే కొంతమంది ఫ్రీగా తినేసి వద్దామని వెళ్తుంటారు. వధువరుల కుటుంబాలతో పరిచయం లేకున్నా.. గుంపులో గోవింద అన్నట్లు భోజనాల్లో కుర్చుంటారు. మనల్ని ఎవరూ చూడట్లేదనే భ్రమతో కడుపునిండా తినేసి వెళ్లిపోతారు. ఇలాంటివి కేవలం మన దేశంలోనే ఉంటాయని చాలామంది అనుకుంటారు. కానీ, ఇతర దేశాల్లోనూ చాలామంది పిలవని పేరంటానికి వచ్చి అప్పనంగా తినేసి వెళ్లిపోతుంటారు. కాలిఫోర్నియాలో ఇలాంటి ఘటనే జరిగింది. అది పెద్ద గొడవగా మారి చివరికి విషాదాంతమైంది.
Samayam Telugu Photo Credit: Pixabay
Photo Credit: Pixabay


వరుడు జాయ్ మెల్గాజ్ (30) పెళ్లయిన కొద్ది గంటల తర్వాత రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమానికి రోనీ క్యాస్టానెదా రమిరెజ్ (28), అతని సోదరుడు జోస్యూ క్యాస్టానెదా రమిరెజ్‌లు ఎలాంటి ఆహ్వానం లేకుండానే రిసెప్షన్‌లో విందు చేయడానికి వెళ్లారు. వారికి వధవురులతో కూడా పరిచయం లేదు. దీంతో జాయ్ కుటుంబికులు వారిని బయటకు వెళ్లిపోవాలని కోరారు. దీన్ని అవమానంగా భావించిన ఆ ఇద్దరు బయటకు వెళ్లిపోయారు.

Also Read: ప్రాణం తీసిన ‘ముద్దు’.. కాళ్లు చచ్చుబడి, మెదడు దెబ్బతిని యువతి మృతి, కారణం ఇదే!

రిసెప్షన్ ముగించుకుని జాయ్ వధువు, అతడి సోదరుడు యాండీ వెలస్క్వేజ్‌తో కలిసి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా నిందితులిద్దరు బ్యాట్‌లతో తిరిగి వచ్చారు. జాయ్‌తో వాగ్వాదానికి దిగారు. బ్యాట్‌లతో కొట్టారు. వారిని అడ్డుకోడానికి ప్రయత్నించిన, అతిథులు, కుటుంబికులకు కూడా గాయాలయ్యాయి. చివరికి జాయ్ తీవ్ర గాయాలతో అక్కడిక్కడే ప్రాణాలు విడించాడు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Also Read: బీచ్‌లో నరమేధం? తెగిపడిన 21 కాళ్లు స్వాధీనం.. కనిపించని శరీరాలు, అక్కడ ఏమైంది?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.