యాప్నగరం

అబ్బో, ఏం దర్జా! శాండ్విచ్ కోసం.. హెలికాప్టర్‌లో 130 కిమీలు ప్రయాణం

యూకేకు చెందిన ఓ పైలట్ తనకు నచ్చిన ఆహారాన్ని కొనుగోలు చేసేందుకు ఏకంగా హెలికాప్టర్‌లో బయల్దేరాడు. లాక్‌డౌన్ నిబంధనల నేపథ్యంలో అతడు ఏకంగా 130 కిమీలు హెలికాప్టర్‌లో ప్రయాణించడం గమనార్హం.

Samayam Telugu 8 Mar 2021, 4:15 pm
లాక్‌డౌన్ సమయంలో ఓ వ్యక్తి అన్నపూర్ణ గోదుమ పిండి కోసం కొన్ని కిలోమీటర్లు బైకు మీద ప్రయాణించిన ఘటన ఎప్పటికీ మరిచిపోలేం. దీన్ని బట్టి.. మనుషులు తమకు నచ్చిన ఆహారం కోసం ఎంత దూరమైనా ప్రయాణించేందుకు సిద్ధమవుతారని అర్థమవుతుంది. అయితే, ఇప్పుడు చెప్పుకోబోయే విషయం తెలిస్తే.. ఆ విషయం చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఎందుకంటే.. ఇతగాడు శాండివిచ్ కోసం ఏకంగా హెలికాప్టర్‌లో బయల్దేరాడు. సుమారు 128 కిమీలు ప్రయాణించాడు.
Samayam Telugu Image Credit: Chipping Farm Shop/Instagram


యూకేలోని లాంక్షైర్‌లో చిప్పింగ్ ఫార్మ్ షాప్ ముందు ఓ హెలికాప్టర్ ఆగింది. అందులో నుంచి దర్జాగా దిగిన పైలట్.. ‘రోస్ట్ బీఫ్’ శాండ్‌విచ్‌ను ఆర్డర్ చేశాడు. అనంతరం ఆ పార్శిల్ పట్టుకుని మళ్లీ హెలికాప్టర్‌లో వెనుతిరిగాడు. చిప్పింగ్ ఫార్మ్ షాప్ యాజమాన్యం ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ప్రస్తుతం యూకేలో లాక్‌డౌన్ నడుస్తున్న నేపథ్యంలో ఆ పైలట్ ఇలా హెలికాప్టర్‌లో వచ్చాడని నిర్వాహకులు తెలిపారు.

Read Also: మిస్సైన ఆ విమానం 35 ఏళ్ల తర్వాత.. 92 అస్థిపంజరాలతో ల్యాండైంది!

అయితే, తమకు నచ్చిన ఆహారం కోసం దూర ప్రయాణాలు చేయడం ఇదే తొలిసారి కాదు. 2020లో ఇలాంటివి చాలానే జరిగాయి. ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి బటర్ చికెన్ కోసం తన ఇంటి నుంచి 32 కిమీలు కారులో ప్రయాణించాడు. అలాగే రష్యాకు చెందిన ఓ వ్యక్తి మెక్‌డోనల్డ్స్ బర్గర్ కోసం ఏకంగా 720 మైళ్లు ప్రయాణించాడు. ఇందుకు 2,680 డాలర్లు (రూ.196,214) వెచ్చించడం గమనార్హం. వీరంతా తాము తినాలనుకొనే ఆహారం కంటే.. ప్రయాణానికే ఎక్కువ ఖర్చు చేశారు. కానీ, వారి వద్ద ఎంత డబ్బు ఉన్నా.. కావాలనుకొనే ఆహారం కాళ్ల వద్దకు రాదని ఈ లాక్‌డౌన్‌తో తెలిసే ఉంటుంది.

వీడియో:
View this post on Instagram A post shared by Chipping Farm Shop (@chippingfarmshop)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.