యాప్నగరం

కస్టమర్‌ను చంపేసిన హోటల్ యజమాని.. రూ.180 కోసం రగడ!

ఆ కస్టమర్‌కు కడుపు నిండా భోజనం పెట్టి మరీ హత్య చేశాడు ఆ హోటల్ యజమాని. కేవలం రూ.180 బిల్లు కోసం నిండు ప్రాణాలను బలిగొన్నాడు.

Samayam Telugu 5 Sep 2019, 7:43 pm
బ్బు.. మనుషులను రాక్షసులను చేస్తుందనడానికి ఈ ఘటనే నిదర్శనం. బిల్లు చెల్లించలేదనే కారణానికి ఓ హోటల్ యజమాని కస్టమర్‌ను చంపేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని బాదోమీ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. సూరజ్ సింగ్, విశాల్‌ దూబే అనే యువకులు భోజనం కోసం హోటల్‌కు వెళ్లారు. భోజనం తర్వాత వెయిటర్ వారికి రూ.180 బిల్లు ఇచ్చాడు.
Samayam Telugu lynching


Read also: సర్‌ప్రైజ్, కళ్లు మూసుకోమని.. భార్య గొంతు కోసిన భర్త!

అయితే, తాము తిన్న భోజనానికి ఎక్కువ బిల్లు వేశారంటూ సూరజ్, విశాల్‌లు హోటల్ యజమానితో వాగ్వాదానికి దిగారు. దీంతో గొడవ పెద్దదై కొట్టుకొనేవరకు వెళ్లింది. ఆగ్రహానికి గురైన హోటల్ యజమాని గుర్మయిల్, అతడి కుమారుడు సురేంద్ర సింగ్‌లు, సిబ్బందితో కలిసి కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు.

Read also: ఫ్రెండ్స్ చెప్పారని.. ఆవు దూడపై వృద్ధుడు అత్యాచారం

దీంతో విశాల్ అక్కడ నుంచి తప్పించుకోగా.. సూరజ్‌ను తీవ్రంగా కొట్టారు. గాయాలతో కదల్లేని పరిస్థితిలో ఉన్న సూరజ్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే, సూరజ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్మయిల్, సురేంద్ర సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన ఇద్దరు వెయిటర్లు పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.