యాప్నగరం

Video: టూరిస్టులకు చుక్కలు చూపించిన ఏనుగు.. పరుగో పరుగు!

ఆ ఏనుగు అలా దాడి చేస్తుందని వారు ఊహించలేదు. కనీసం దాడి చేస్తే... తప్పించుకునే ప్లాన్ కూడా వారి దగ్గర లేదు. సడెన్‌గా జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Samayam Telugu 1 Dec 2021, 11:05 am
ఏనుగులు వన్య ప్రాణులు.. వాటిని పెంచుకోకూడదు.. అని భారత సుప్రీంకోర్టు ఓ తీర్పులో చెప్పింది. నిజమే... ఏనుగులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో అంచనాకు అందవు. సాధారణంగా అవి ఎవరి జోలికీ రావు. ఎవరిపైనా దాడి చెయ్యవు. ఇతర జంతువులతో కూడా గజాలు మౌనంగానే ఉంటాయి (elephant video). కానీ వాటికి కోపం వస్తే మాత్రం ఎవర్నీ లెక్క చెయ్యవు. అవతల ఉన్నది మనిషైనా, జంతువైనా క్రూరంగానే ప్రవర్తిస్తాయి. కంటిన్యూగా ఘీంగరిస్తూ... కాళ్లతో తొక్కడం, దంతాలతో విసిరేయడం వంటివి చేస్తాయి. తమకు ఆపద కలుగుతోంది అని భావించిన సందర్భంలో ఏనుగులు ఇలా విపరీతంగా ప్రవర్తిస్తాయి. (elephant attacks on tourists). తాజాగా ఓ ఏనుగు అదే చేసింది. ఆఫ్రికా సఫారీ (africa safari)లో అత్యంత భీకరంగా ప్రవర్తించింది (angry elephant video). దాని దెబ్బకు టూరిస్టులకు చుక్కలు కనిపించాయి.
Samayam Telugu ఏనుగు ఆగ్రహిస్తే... (image credit - twitter - @ParveenKaswan)


ఆకట్టుకునే ఆఫ్రికా సఫారీ:
ఆఫ్రికా ఓ కరవు ఖండం. అక్కడ టూరిస్టులకు సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. అయినప్పటికీ విదేశీ టూరిస్టులు ఆఫ్రికా సఫారీకి వెళ్లేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఇందుకు కారణం ఉంది. ఆఫ్రికా సఫారీ చాలా థ్రిల్ కలిగిస్తుంది. వన్యమృగాలను దగ్గరగా చూడటమే కాదు... అక్కడ తీసే ఫొటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా ఉంటుంది. కొన్ని చెట్లు పచ్చగా... గడ్డి పసుపు రంగులో... దూరంగా ఎర్రటి సూరీడు... మధ్యలో ఆహారం తినే జంతువులు... ఇలా ఫొటోగ్రఫీ చాలా బాగా వస్తుంది. అందుకే టూరిస్టులు రెక్కలు కట్టుకొని సఫారీలో వాలిపోతారు. తాజాగా కొందరు టూరిస్టులు... ఓపెన్ టాప్ జీపులో సఫారీకి వెళ్లారు.

జీపు డ్రైవర్... ఏనుగులకు దగ్గరగా జీపును ఆపారు. జీపు నుంచి కిందకు దిగకుండా వాటిని చూసి ఉంటే... అవి టూరిస్టుల జోలికి వచ్చేవి కావు. కానీ ఆ టూరిస్టులు డ్రైవర్ మాట వినలేదు. కొందరు ఏనుగుల దగ్గరకు వెళ్లారు. దాంతో ఓ పెద్ద ఏనుగు... తమకు ఆపద కలగబోతోందని భావించి... రివర్స్ ఎటాక్ మొదలుపెట్టింది. జీపు దగ్గరకు వచ్చి... ఇష్టమొచ్చినట్లు కుదిపేసింది. ఆ సమయంలో ఓ టూరిస్టు... ఏనుగును వీడియో తీస్తున్నారు. ఏనుగు కుదిపేయడంతో... వీడియో కూడా గందరగోళం అయ్యింది. జీపుపై దాడి చేసిన ఏనుగు... కాసేపటికి నెమ్మదించింది. దాంతో... టూరిస్టులు జీపు దిగి ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. సఫారీలో ఇలాగే ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనాకు అందదు.

ఆ వీడియో (safari video)ని ఇక్కడ చూడండి.

లక్కీగా ఈ ఘటనలో టూరిస్టులకు ఏనుగు హాని చెయ్యలేదు. భయపెట్టి వదిలేసింది. ఈ వీడియోని IFS ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. "ఏనుగుల దగ్గరకు వెళ్లి వాటిని ఇబ్బంది పెట్టకూడదు" అని వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు.


ఈ వీడియోని ఇప్పటికే 48వేల మందికి పైగా చూశారు. "వారు స్వయంగా అది కోరుకున్నారు" అని ఓ నెటిజన్ స్పందించగా... "తెలియని వ్యక్తులు మనం పిలవకుండా మన ఇంట్లోకి వస్తే మనం ఊరుకుంటామా... ఓసారి ఆలోచించండి... మనుషులమైన మనమే ఊరుకోము... జంతువులైన ఏనుగులు మాత్రం టూరిస్టులను ఏమీ చెయ్యకుండా వదిలాయి" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.