యాప్నగరం

మటన్ కూర కోసం హత్య.. భార్యను సజీవ దహనం చేసిన భర్త

దారుణం.. మటన్ కూర వల్ల నిండు ప్రాణాలు బలయ్యాయి. తల్లి మరణించి, తండ్రి జైలుపాలు కావడంతో వారి పిల్లల జీవితాలు రోడ్డునపడ్డాయి.

Samayam Telugu 18 Dec 2019, 6:02 pm
ద్యం మత్తు మనిషిలో మానత్వాన్ని చంపేస్తుందని చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. తన భార్య.. భోజనంలో మటన్ కూర తక్కువగా వడ్డించిందనే చిన్న కారణంతో ఓ వ్యక్తి ఆమెను సజీవ దహనం చేశాడు. ఈ ఘటన ముంబయిలోని జుయి కామోథే ప్రాంతంలో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన మారుతీ సరోడే కూలి పనుల కోసం భార్య పల్లవి, నలుగురు పిల్లలతో కలిసి ముంబయికి వలస వచ్చాడు.
Samayam Telugu Image by Hans Braxmeier from Pixabay
Image by Hans Braxmeier from Pixabay


Also Read: మహిళ తల నరికి, మెదడును తినేసిన రాక్షసుడు.. కారణం ‘ఇంగ్లీష్’

డిసెంబరు 4న భోజనం చేస్తుండగా పల్లవి అతడికి మటన్ కూర వడ్డించింది. కూర తక్కువగా ఉండటంతో మారుతీ భార్యతో గొడవకు దిగాడు. అనంతరం ఆమె వంటిపై కిరోసిన్ పోసి నిప్పటించాడు. ఈ హఠాత్పరిణామానికి పిల్లలు బయటకు పరుగులు తీసి సాయం కోసం కేకలు పెట్టారు. దీంతో స్థానికులు మంటలు ఆర్పి ఆమెను డీవై పాటిల్ హాస్పిటల్‌లో చేర్చారు. ఆమె పరిస్థితి విషమయంగా ఉండటంతో తర్వాతి రోజు ఆమెను సియాన్ హాస్పిటల్‌కు తరలించారు. డిసెంబరు 9న ఆమె పోలీసులతో మాట్లాడుతూ.. భర్తే తనని చంపాడని, కోపంతో కిరోసిన్ పోసి నిప్పంటించాడని వాగ్మూలం ఇచ్చింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఆ పిల్లల జీవితాలు రోడ్డునపడ్డాయి.

Also Read: హ్యాండ్ పంపు నుంచి నీటికి బదులు రక్తం, మాంసం.. భయపడుతున్న ప్రజలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.