యాప్నగరం

Video: కదిలే రైలు నుంచి దూకిన మహిళలు.. సరిగ్గా ఆ క్షణంలో..!

Indian railways: కదిలే రైలు నుంచి దిగకూడదు, ఎక్కకూడదని తెలిసి కూడా చాలా మంది తెగిస్తారు. అసలు వారు ఎందుకు పడిపోతున్నారు... ఏం జరుగుతోంది?

Samayam Telugu 4 Dec 2021, 9:46 am
అనుకోకుండా జరిగే రైలు ప్రమాదాలు చాలా వరకూ తగ్గాయి. ఐతే... ప్రయాణికుల్లో చాలా మంది స్వయంగా ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నారు. కదిలే రైలు నుంచి దిగితే పడిపోతామని తెలిసి కూడా తెగిస్తున్నారు. ఈమధ్య ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. దేశవ్యాప్తంగా ఆయా రైల్వే స్టేషన్లలోని సీసీటీవీ కెమెరాల్లో (CCTV Video) అవి రికార్డ్ అవుతున్నాయి. ఇలాంటి ఘటనల వీడియోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్న రైల్వే శాఖ... ఇలా చెయ్యవద్దని ప్రజలను కోరుతోంది. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో అలాంటి ఘటనే జరిగింది. సంత్రాగాచి - ఆనంద్ విహార్ ఎక్స్‌ప్రెస్... పురూలియా స్టేషన్ దగ్గర ఆగాల్సి ఉంది. రైలు ఆగకముందే ఇద్దరు మహిళలు ప్లాట్‌ఫామ్ పైకి దూకేశారు. (Train Accident Video)
Samayam Telugu రైలు ప్రమాద దృశ్యం (image credit - twitter - @serailwaykol)


ఇద్దరు మహిళలూ బ్యాలెన్స్ తప్పారు. ప్లాట్‌ఫామ్‌పై పడిపోయారు. ఓ మహిళ కాస్త దూరంగా పడింది. మరో మహిళ ఏకంగా రైలు పక్కనే పడింది. ఆ సమయంలో రైల్వే రిజర్వ్ పోలీస్ విభాగంలోని ఆన్ డ్యూటీ సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ బబ్లూ కుమార్ చూసి... వెంటనే వెళ్లి ఆ మహిళల్ని కాపాడారు. ఇతర ప్రయాణికులు కూడా తలో చెయ్యీ వేసి వారికి ప్రాణాపాయం తప్పించారు. ఇందుకు సంబంధించిన వీడియోని ట్వి్ట్టర్‌లోని @serailwaykol అకౌంట్‌లో రైల్వే శాఖ నవంబర్ 30న పోస్ట్ చేసింది. (Indian Railways Video)

ఆ వీడియో (viral video)ని ఇక్కడ చూడండి

సైన్స్ ప్రకారం కదిలే వాహనాల్లో ఉండేవారికి గతి గమన శక్తి ఉంటుంది. అందువల్ల వారు సడెన్‌గా వాహనం దిగితే... వెంటనే స్థితి శక్తిలోకి రారు. అందువల్లే పడిపోతారు. అందుకే... వాహనం ఆగాకే దిగాలి.

షెడ్యూల్ ప్రకారం ఆ రైలు అక్కడ 2 నిమిషాలు ఆగుతుంది. మరి ఆ మహిళలకు అంత కంగారు ఎందుకు... రైలు పూర్తిగా ఆగిన తర్వాతే దిగవచ్చు కదా.. ఓ నిమిషం పోతే కొంపలు మునిగిపోవు... అదే ప్రాణాలు పోతే తిరిగి రావు. ఇలా చెయ్యవద్దని నెటిజన్లు కోరుతున్నారు.

Video: దేవుడా.. కదలని విమానం.. నెట్టిన ప్రయాణికులు..!
ఈ ఘటనలో రైల్వే పోలీస్ చేసిన పనిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. "నైస్ జాబ్" అని ఓ యూజర్ మెచ్చుకోగా... "నిజంగా బాగా కాపాడారు. అలాంటి అధికారులను గౌరవించాలి. రైల్వే శాఖ అతనికి శాలరీలో కొంత ఇంక్రిమెంట్ ఇవ్వాలి" అని మరో యూజర్ ప్రశంసించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.