యాప్నగరం

ఇదేం పైత్యం? కరోనాకు గుడి కట్టి పూజలు, షాకింగ్ వీడియో

కరోనా భూతం ఎప్పుడు వదిలిపోతుందా అని జనాలు ఎదురుచూస్తుంటే.. కొందరు మాత్రం కరోనా భూతం కాదు దైవం అని అంటున్నారు. ఇతడు ఏకంగా గుడి కట్టి మరీ కరోనా మాతకు పూజలు చేస్తు్న్నాడు.

Samayam Telugu 23 Jul 2020, 12:29 pm
క పక్క జనాలు కరోనాకు భయపడి వణికిపోతుంటే.. కొందరు మాత్రం ఆ వైరస్‌ను దైవంగా భావిస్తూ పూజలు చేస్తున్నారు. ఇటీవల కొంతమంది మహిళలు కరోనా వైరస్‌కు పూజలు చేస్తున్న వీడియోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. వైరస్‌ను అమ్మవారిగా భావిస్తూ ‘కరోనా మాయి’ (కరోనా మాత) పేరుతో పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ పట్టణంలో చిన్నమస్తా చెరువు ఒడ్డున చిన్న సైజు గుడి కూడా కట్టేశారు. అక్కడ కరోనాకు నిత్యం పూజలు చేస్తున్నారు. పండ్లు, పూలు సమర్పిస్తున్నారు. శాంతించాలని ప్రార్థనలు చేస్తున్నారు.
Samayam Telugu Image Credit:  South China Morning Post/YouTube


అయితే, కేరళకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా తన ఇంట్లోనే గుడి కట్టేశాడు. కాళిమాత మెడలో కరోనా నమూనాను వేలాడి దీసి నిత్యం పూజలు చేస్తున్నాడు. కడక్కల్ పట్టణంలో నివసిస్తున్న అనిలన్ ముహూర్తం.. కరోనాను దేవుడని నమ్ముతున్నాడు. ‘‘మన చుట్టూ ఉండే ప్రతి దూళిలోనూ దేవుడు ఉంటాడు. అందుకే కరోనాను దేవుడని భావిస్తున్నా. దేశంలో దేనినైనా పూజించవచ్చే హక్కు పౌరులకు ఉంది. అందుకే, ఈ ఆలయాన్ని ఏర్పాటు చేశాను. బాధితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వైద్యులు, వ్యాక్సిన్ తయారీకి శ్రమిస్తున్న పరిశోధకుల కోసం ప్రార్థిస్తున్నా’’ అని తెలిపాడు. ఎవరైనా సరే ఈ ఆలయంలో కరోనా మాతను పూజించవచ్చని, పోస్టు ద్వారా పూజా సామాగ్రి పంపిస్తే.. పూజ చేసి ప్రసాదాన్ని పంపిస్తానని అనిలన్ చెబుతున్నాడు. ఈ కింది వీడియోలో అనిలన్ ఆలయాన్ని చూడవచ్చు.

వీడియో:
Read Also: 30 ఏళ్ల తర్వాత.. భార్య మగాడని తెలిసింది, బెంగాల్‌లో అరుదైన ఘటన

Read Also: భర్తకు విడాకులిచ్చి కొడుకును పెళ్లాడిన తల్లి.. ఇదేం ప్రేమో!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.