యాప్నగరం

వ్యక్తి ప్రాణం తీసిన ‘భావప్రాప్తి’.. పోస్ట్‌మార్టంలో ఏం తేలిందంటే..

ఆ కోరిక ఓ వ్యక్తి ప్రాణం తీసింది. కలయిక వల్ల భావోద్వేగం ఎక్కువై అతడు చనిపోయినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌‌ వెల్లడించింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Samayam Telugu 30 Jan 2021, 5:15 pm

ప్రధానాంశాలు:

  • ఓ వ్యక్తి భావప్రాప్తితో ప్రాణం కోల్పోయాడు.
  • బెడ్ మీద ఆ పనిలో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలాడు.
  • పోస్ట్ మార్టం రిపోర్టులో అతడు ఉద్వేగానికి గురికావడం వల్లే చనిపోయినట్లు నిర్ధరించారు.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Representational image
వ్యక్తి ఎవరూ ఊహించని రీతిలో మరణించాడు. ఓ హోటల్ గదిలో వేశ్యతో ఏకాంత సేవలో ఉండగా.. ఒక్కసారిగా కుప్పకూలాడు. పోస్ట్‌మార్టంలో అతడు.. ‘కలయిక’ సమయంలో తీవ్ర ఉద్వేగంతో భావప్రాప్తి(Excessive orgasm)కి గురై చనిపోయినట్లు తెలిపాడు. ఆశ్చర్యాన్ని కలిగించే ఈ ఘటన ఆఫ్రికాలోని మలావీ ప్రాంతంలో చోటుచేసుకుంది.
‘డైలీ స్టార్’ వెబ్‌సైట్ కథనం ప్రకారం.. చార్లెస్ మజావా అనే 35 ఏళ్ల వ్యక్తి ఓ హోటల్‌లో రూమ్‌ బుక్ చేసుకున్నాడు. ఆ కోరిక తీర్చుకోవడం కోసం ఓ మహిళను తీసుకొచ్చాడు. బెడ్ మీద ఆ ‘పని’ చేస్తుండగా తీవ్ర ఉద్వేగానికి గురయ్యాడు. దీంతో వెంటనే కుప్పకూలిపోయాడు. దీంతో ఆ మహిళ భయపడి పోలీసులకు సమాచారం అందించింది.
దోపిడీకి వచ్చిన దొంగతో యువతి పాడుపని.. చివరికి, దిమ్మతిరిగే ట్విస్ట్!పోలీసులు అతడి భౌతిక కాయాన్ని పోస్ట్‌మార్టం తరలించారు. రిపోర్టులో వైద్యులు షాకింగ్ విషయాన్ని తెలిపారు. అతడు అధిక భావోద్వేగానికి గురికావడం వల్ల మెదడులోని రక్త నాళాలు పగిలిపోయాయి. దీంతో అతడు కుప్పకూలడు. హాస్పిటల్‌కు తరలించే లోపే అతడు చనిపోయాడు. అయితే, ఈ ఘటన స్థానిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.