యాప్నగరం

44 మంది పిల్లలను కన్న మహిళ.. ఇక చాలు, ఆపాలంటూ ప్రభుత్వం ఆదేశం

40 ఏళ్ల వయస్సుకే 44 మంది పిల్లలను కన్న ఆమె.. ప్రభుత్వ ఆదేశాలతో వెనక్కి తగ్గింది. వయస్సుతో సమానంగా అంతమంది పిల్లలను ఆమె ఎలా కన్నది? అదెలా సాధ్యమైందో చూడండి.

Samayam Telugu 18 Oct 2019, 10:54 pm
రోజుల్లో ఇద్దరు పిల్లలను పోషించడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది ఆమె ఏకంగా 44 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఆమెను అలాగే వదిలేస్తే అర్థ శతకం చేస్తుందని భావించిన ప్రభుత్వం.. ఇక పిల్లలను కనడం ఆపాలంటూ ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యులు సైతం అప్రమత్తమయ్యారు. ఆమె గర్భాశయాన్ని తొలగించాలని ఆదేశించింది.
Samayam Telugu GettyImages-177705455


40 ఏళ్లకే 44 మంది పిల్లలు: ఉగాండాకు చెందిన 40 ఏళ్ల మరియంకు 44 మంది పిల్లలు ఉన్నారు. వీరంతా ఆమెకు పుట్టిన బిడ్డలే. పిల్లలను కనాలంటే కనీసం తొమ్మిది నెలలు పడుతుంది. మరి 40 ఏళ్ల వయస్సులో 44 మంది ఎలా కనేసింది? ఇది ఫేక్ అనుకుంటున్నారా? అయితే, ఆమెకు ఉన్న సమస్య గురించి తెలుసుకోవల్సిందే.

Read also: చనిపోయినా నవ్వించాడు.. అంత్యక్రియల్లో నవ్వులు పూయించిన మృతుడు

అరుదైన అండాశయం: మరియంకు 12 ఏళ్లకే పెళ్లి జరిగింది. 13వ ఏటే ఆమెకు కవల పిల్లలు జన్మించారు. దీంతో ఆమె వైద్యులను సంప్రదించి గర్భ నివారణ చేయాలని కోరింది. ఈ సందర్భంగా ఆమెకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అది సాధ్యం కాదని చెప్పారు. పైగా ఆమె అండాశయాలు చాలా పెద్దవని, భవిష్యత్తులో మరింత మంది కవలలు పుట్టే అవకాశం ఉందన్నారు. చివరికి వైద్యులు చెప్పినట్లే జరిగింది. ఆమె గర్భాశయంలో ఒకేసారి అనేక అండాలు విడుదల కావడం వల్ల ఆమెకు ఒకేసారి ఇద్దరు నుంచి నలుగురు పిల్లలు చొప్పున జన్మించారు.

మరియం కుటుంబాన్ని ఈ కింది ట్వీట్లో చూడండి:

38 మందే మిగిలారు: తొలి కాన్పులో కవలలకు జన్మనిచ్చిన ఆమె.. ఆ తర్వాత 5 సార్లు కవలలు, ఏడు సార్లు ముగ్గురేసి, ఐదుసార్లు నలుగురేసి పిల్లలకు జన్మనిచ్చింది. అలా 40 మందికి ఆమె జన్మనిచ్చింది. వీరిలో కొందరు పుట్టగానే చనిపోవడంతో ప్రస్తుతం 38 పిల్లలే ఉన్నారు. మూడేళ్ల కిందట భర్త ఆమెను వదిలేశాడు. దీంతో ఆ 38 మంది పిల్లలను పోషించే బాధ్యత ఆమెపైనే పడింది.

Read also:
భయపెట్టే చిత్రాలు.. పిల్లలను దెయ్యాలుగా మార్చిన తల్లి, తిట్టిపోస్తున్న నెటిజన్స్!

భర్తకు 45 మంది..: రోజుకు సుమారు 25 కిలోల గోదుమ పిండి ఖర్చవుతుందని ఆమె ఓ వార్త సంస్థకు వెల్లడించింది. వారిని పోషించడానికి రెక్కలు ముక్కలు చేసుకుంటున్నానని తెలిపింది. మళ్లీ గర్భం దాల్చితే తన ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పారని తెలిపింది. అయితే, తన గర్భాశయం తొలగించడం అంత సులభమైన పని కాదని వైద్యులు చెప్పారని తెలిపింది. తన భర్త ఈ 38 మంది పిల్లలే కాకుండా వేర్వేరు మహిళలతో ద్వారా 45 మందిని కన్నాడని పేర్కొంది.

Read also: కడుపు నొప్పని వెళ్లిన యువకుడికి ప్రెగ్నెన్సీ పరీక్షలు.. డాక్టర్ ఘనకార్యం

చిత్రం ఏమిటంటే.. ఆ 38 పిల్లలను ఆమె ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. స్కూల్‌కు పంపి చదివిస్తోంది. ఆ ఇంట్లో గోడలపై మెడల్స్ సాధించిన తన చిన్నారుల ఫొటోలు గర్వంగా పలకరిస్తాయి. ఈమె పరిస్థితి చూసి ప్రభుత్వం ఆదుకోడానికి ప్రయత్నిస్తోంది. అయితే.. ఇకపై పిల్లలను కనకూడదనే షరతు విధించింది. ప్రపంచంలో అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్న దేశాల్లో ఉగాండా కూడా ఒకటి. అక్కడ సంతాన నియంత్రణపై ప్రజలకు కనీస అవగాహన ఉండదు. ఫలితంగా అక్కడ జనాభాతోనే పేదరికం కూడా బాగా పెరుగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.