యాప్నగరం

వంతెనను కట్‌చేసి ఎత్తుకుపోయిన దొంగలు.. షాకులో పోలీసులు!

75 అడుగుల పొడవు, 56 టన్నుల బరువైన వంతెనను కట్ చేసి మరీ ఎత్తుకుపోయిన దొంగలు. నోరెళ్లబెట్టిన పోలీసులు.

Samayam Telugu 5 Jun 2019, 11:18 pm
వీళ్లు సాధారణ దొంగలు కాదు.. ఘరానా దొంగలను మించిన దొంగలు. ఎవరికీ అనుమానమే రాకుండా 56 టన్నులు, 75 అడుగుల పొడవైన వంతెనను ఎత్తుకెళ్లిపోయారంటే వారు ఎంత తెలివిగా ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. రష్యాలోని ఆర్కిటిక్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
Samayam Telugu NINTCHDBPICT000495184485


ఐకువెన్, లొవోజిరో ప్రాంతాలను కలుపుతూ ఉంబా నదిపై నిర్మించిన రైల్వే బ్రిడ్జ్ శిథిల స్థితికి చేరడంతో అటుగా రైళ్ల రాకపోకలను నిలిపేశారు. ఈ వంతెన మధ్య భాగం నీటిలో పడిపోయిన ఫొటో ఒకటి మే 16న సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. మే 26న అధికారులు విడుదల చేసిన ఫొటోలో నీటిలో కూలిన వంతెన భాగం కూడా కనిపించలేదు.
ఈ ఘటనపై మీడియా అధికారులను ప్రశ్నించగా ఆ శిథిలాలను తాము తొలగించలేదని తెలిపారు. దీంతో ఆ వంతెన దానంతట అదే కూలలేదని, దొంగలే దాన్ని కట్ చేసి నదిలో పడేశారని, ఆ తర్వాత ముక్కులు చేసి ఎత్తుకుపోయారని తెలిసింది. నది ప్రవాహం సాధారణంగానే ఉండటంతో అది ప్రకృతి వల్ల చోటుచేసుకోలేదని నిర్ధారించారు. ఈ ఘటనపై స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
Photos Credit: Vk.com

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.