యాప్నగరం

రాళ్లను ఉడకబెట్టి.. లాక్‌డౌన్‌లో పిల్లల ఆకలి తీర్చలేక ఆ తల్లి ఏం చేసిందంటే..

ఆ తల్లి తన గుండెను రాయి చేసుకుంది.. పిల్లల ఆకలిని చూడలేక రాళ్లను ఉడకబెట్టింది. కానీ, తినేందుకు కాదు.

Samayam Telugu 2 May 2020, 10:45 pm
లాక్‌డౌన్.. సంపన్నులకు టైంపాస్ కావచ్చు. కానీ పేదలకు మాత్రం ప్రతి క్షణం నరకమే. కరోనా కంటే ప్రమాదకరమైన ఆకలితో పోరాడుతూ రోజులు గడపాలి. కూలీ లేక.. ఖాళీగా కుర్చులేక.. కడుపు నిండ తినలేక.. ఇలా ఒకటి కాదు, ఎన్నో సమస్యలతో పోరాడుతూ సమయాన్ని గడపాలంటే మాటలు కాదు. ఇంట్లో సరుకులు అడుగంటినప్పుడు పిల్లలు.. ‘‘అమ్మా ఆకలి’’ అంటే ఆ తల్లికి ఏ సమాధానం చెప్పాలో తోచదు. అందుకే, ఆ తల్లి తన పసివాళ్లను మభ్యపెట్టి.. ఆకలిని మైమరిపించే ప్రయత్నంలో రాళ్లను ఉడకబెట్టింది.
Samayam Telugu Photo By: Ntv Kenya


అయితే, ఆ రాళ్లను ఆమె పిల్లలకు తినిపించేందుకు ఉడకబెట్టలేదు. తినేందుకు అమ్మ ఏదో వండుతుందని భావించి.. నిశబ్దంగా ఉంటారని. గుండెను బరువెక్కించే ఈ ఘటన కెన్యాలో చోటుచేసుకుంది. మోంబాసాకు చెందిన పెనినా బహాతీలో కిస్తవో‌లో అనే మహిళ.. లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయింది. సాధారణ రోజుల్లో ఇంటింటా తిరుగుతూ బట్టలు ఉతికేది. ఆ డబ్బుతో సరకులు కొనుగోలు చేసి పిల్లల ఆకలి తీర్చేది.

Also Read: కరోనా భయం.. వీర్యాన్ని జ్యూస్‌లో కలుపుకుని తాగేస్తున్న మహిళ, ఎందుకంటే..

పెనినాకు ఎనిమిది మంది పిల్లలు. లాక్‌డౌన్ తర్వాత ఆమె ఉపాధి కోల్పోయింది. క్రమేనా ఇంట్లో సరుకులు కూడా అడుగంటాయి. కొద్ది రోజులు ఇరుకు పొరుగు ప్రజలు సాయంతో పిల్లల ఆకలి తీర్చింది. కానీ, పొరుగువాళ్లది కూడా అదే పరిస్థితి. దీంతో ఆమెకు ఏం చేయాలో తోచలేదు. పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే.. ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. తినడానికి ఏమీలేదంటే పిల్లలు మరింత ఏడుస్తారని భావించింది. దీంతో కొన్ని రాళ్లను నీటిలో ఉన్న పాత్రలో వేసింది.

Also Read: వామ్మో.. చిన్నారి వెన్నెముకతో హ్యాండ్ బ్యాగ్, వీడు మనిషేనా?.. నెటిజన్స్ గుర్రు!

ఆ పాత్రను పొయ్యి మీద పెట్టి ఉడికించడం మొదలుపెట్టింది. దీంతో పిల్లలు తల్లి తినడానికి ఏదో చేస్తుందని భావించారు. ఏడ్వకుండా అమ్మ వైపే చూడసాగారు. దీంతో ఆమె వంటకు కాస్త సమయం పడుతుందని చెప్పి.. ఆ పిల్లలను పడుకోబెట్టింది. ఇలా రోజూ ఏదో ఒకలా పిల్లలను మభ్య పెడుతూ కాలం గడుపుతోంది. ఈ విషయం మీడియా ద్వారా బయటకు తెలిసింది. దీంతో పలువురు ఆమెకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. మొత్తానికి మీడియా దయవల్లా ఆమెకు కాస్త ఉపశమనం లభించింది. ఆ పిల్లల ఆకలి తీరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.