యాప్నగరం

మొసలి నోట్లో పసివాడు.. తెలివిగా కాపాడిన తల్లి

తల్లి కళ్ల ముందే మొసలి పసివాడి తలను పట్టుకుని చంపేందుకు ప్రయత్నించింది. అయితే, ఆ తల్లి తన తెలివిని ఉపయోగించి కొడుకును కాపాడుకుంది.

Samayam Telugu 20 Apr 2020, 9:45 pm
పదలో ఉన్నప్పుడు భయంతో పరుగులు పెట్టడానికి బదులు బుర్రను ఉపయోగిస్తే తప్పకుండా ముప్పు నుంచి బయటపడవచ్చు. ఇందుకు ఈ మహిళే నిదర్శనం. జింబాబ్వేకు చెందిన మౌరినా ముసిసినానా అనే మహిళ తన ఇద్దరు బిడ్డలతో కలిసి రుండే నది తీరానికి వెళ్లింది. అక్కడ గొడుగు వేసి పిల్లలను కుర్చోబెట్టి, ఆడుకోమంది. అనంతరం నదిలో చేపలు పట్టేందుకు వెళ్లింది.
Samayam Telugu vietnam-1742444_1280


కొద్ది నిమిషాల తర్వాత పిల్లల అరుపులు వినిపించాయి. దీంతో కంగారుపడిన మౌరినా పరుగు పరుగున అక్కడికి చేరుకుంది. నది నుంచి ఒడ్డుకు వచ్చిన మొసలి మూడేళ్ల కొడుకు ముఖాన్ని పట్టుకుని నీటిలోకి లాక్కెళ్లడం చూసి హడలిపోయింది. అయితే, భయపడకుండా ఒక్క ఉదుటున మొసలిపైకి ఎగిరి కుర్చొంది. అనంతరం ఆమె తన వేళ్లను మొసలి ముక్కులోకి దూర్చి ఊపిరి ఆడకుండా చేసింది. దీంతో అది పిల్లాడిని వదిలిపెట్టింది.

ముఖానికి గాయాలు కావడంతో బాలుడికి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో హుటాహుటిన హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. ప్రస్తుతం అతడు గాయాల నుంచి కోలుకుంటున్నాడని మౌరినా తెలిపింది. ‘‘కొన్నాళ్ల కిందట మొసలి పట్టును తప్పించుకొనే విధానాన్ని మా పెద్దలు దగ్గర నేర్చుకున్నాను. అదే ఇప్పుడు నా కొడుకును కాపాడుకోవడానికి ఉపయోగిపడింది. మొసలికి ఊపిరి ఆడకుండా చేస్తే.. బలం కోల్పోతుంది. అందుకే, అలా చేశాను. మరో చేతిని నా బిడ్డ తలను విడిపించేందుకు ఉపయోగించాను’’ అని తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.