యాప్నగరం

గాజు ముక్కలే అతడి ఆహారం.. 45 ఏళ్ల నుంచి నమిలి మింగేస్తున్నాడు!

వీడియో: వామ్మో.. ఈ వ్యక్తి స్నాక్స్ తిన్నంత సులభంగా గాజు ముక్కలను తినేస్తున్నాడు.

Samayam Telugu 15 Sep 2019, 1:09 am
గాజు ముక్కలను అతడు జంతికలు తిన్నట్లుగా నమిలి మింగేస్తున్నాడు. ఇదేదో కొత్తగా వచ్చిన అలవాటు అనుకొంటే పొరపాటే. 45 ఏళ్ల కిందటి నుంచే అతడు దీన్ని వ్యసనంగా మార్చుకున్నాడు. కఠినమైన గాజు పెంకులను జీర్ణం చేసేసుకుంటున్నాడు. ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే, మీరు తప్పకుండా మధ్య ప్రదేశ్ వెళ్లాల్సిందే.
Samayam Telugu glass-eater-wp


Read also: మూత్రమే వారికి షాంపూ.. ఇల్లు, ఉద్యోగం వదిలి అడవి బాట పట్టిన జంట!

దిందోరీ ప్రాంతంలో నివసిస్తున్న న్యాయవాది దయారాం సాహుకు గాజు పెంకులంటే ప్రాణం. బాటిల్ కనిపిస్తే చాలు.. అతడికి నోరూరుతుంది. వెంటనే దాన్ని ఖాళీ చేసి పరపరా నమిలేయాలనేంత ఆశ పుడుతుంది. అందుకే ఇంట్లో వాళ్లు ఆయనకు గాజు సీసాలను దూరంగా పెడతారు. దయారాం 45 ఏళ్లుగా గాజు పెంకులు తింటున్నాట్లు ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపాడు.

Read also: ఆహారం ముట్టని అమ్మాయి.. గాలి పీలుస్తూ హాయిగా బతికేస్తోంది!

‘‘ఇది నాకు ఒక వ్యసనం. దీనివల్ల నా పళ్లు దెబ్బతిన్నాయి. ఇలా గాజు పెంకులు తినాలని నేను ఎవరూ సూచించను. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. నేను కూడా వీటిని తినడం బాగా తగ్గించాను’’ అని తెలిపాడు. ఇటీవల ఆ గాజు పెంకుల వల్ల దయారాం అంతర్గత అవయవాల్లో గాయాలై రక్తం కారినట్లు వైద్యులు చెప్పారు. అప్పటి నుంచి గాజు ముక్కలను తక్కువ సంఖ్యలో తింటున్నాడు. దయారాం గాజు పెంకులను తినడాన్ని పై వీడియోలో చూడగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.