వెబ్సీరిస్లకు యువత బానిసలు అవుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా.. వాటిని చూస్తేనే ఉన్నారు. లాక్డౌన్లో ఈ అలవాటు మరింత పెరిగింది. వెబ్సీరిస్ చూసే ఆ అలవాటే.. 75 మంది ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగపడింది. ముంబయిలోని డొంబివ్లీలో ఇటీవల రెండు అంతస్థుల భవనం కుప్పకూలింది. కునాల్ మోమైత్ అనే యువకుడి అప్రమత్తత వల్ల 75 మంది ప్రాణాలతో బయటపడ్డారు. లేకుంటే.. అంతా ఆ శిథిలాల కిందే సజీవ సమాథులయ్యేవారు.
అంతా నిద్రపోతున్న సమయంలో కునాల్ తన మొబైల్లో వెబ్సీరిస్లు చూస్తూ బిజీగా ఉన్నాడు. రాత్రంతా అదే పనిగా వీడియోలు చూస్తూ కూర్చున్నాడు. తెల్లవారుజాము 4 గంటల సమయంలో తన ఇంట్లోని వంట గదిలో ఏదో అలికిడి వినిపించింది. అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా.. కిచెన్ గోడలకు ఉన్న పగుళ్లు మెల్లగా కదులుతున్నట్లు కనిపించింది.
Read Also: ‘ఆంటీ’ అని పిలించిందని.. యువతిని చితకబాదిన మహిళ, వీడియో వైరల్
దీంతో ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందని గుర్తించి వెంటనే తన తల్లిదండ్రులను నిద్రలేపాడు. అనంతరం ఆ భవనంలో నివసిస్తున్న మిగతావాళ్లను సైతం నిద్రలేపి బయటకు వెళ్లాలంటూ కేకలు పెట్టాడు. అంతా బయటకు వచ్చిన కొన్ని క్షణాల్లోనే భవనం కుప్పకూలింది. దీంతో అంతా హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. కునాల్ వల్లే తాము ప్రాణాలతో బయటపడ్డామని అంటున్నారు.
Read Also: పామును పెళ్లి చేసుకున్న యువకుడు.. రెండో చూపులోనే ప్రేమ!
అయితే, ఆ భవనం శిథిల స్థితికి చేరిందని, వెంటనే ఖాళీ చేయాలని అధికారులు తొమ్మిది నెలల కిందటే హెచ్చరించారు. అంతా నిరుపేదలు కావడం వల్ల ఆ భవనాన్ని వదిలి బయటకు వెళ్లలేకపోయారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల భవనం మరింత శిథిల స్థితికి చేరుకుంది. చివరికి.. కుప్పకూలింది. దీంతో ఆ పేదలు నీడ కోల్పోయారు.
అంతా నిద్రపోతున్న సమయంలో కునాల్ తన మొబైల్లో వెబ్సీరిస్లు చూస్తూ బిజీగా ఉన్నాడు. రాత్రంతా అదే పనిగా వీడియోలు చూస్తూ కూర్చున్నాడు. తెల్లవారుజాము 4 గంటల సమయంలో తన ఇంట్లోని వంట గదిలో ఏదో అలికిడి వినిపించింది. అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా.. కిచెన్ గోడలకు ఉన్న పగుళ్లు మెల్లగా కదులుతున్నట్లు కనిపించింది.
Read Also: ‘ఆంటీ’ అని పిలించిందని.. యువతిని చితకబాదిన మహిళ, వీడియో వైరల్
దీంతో ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందని గుర్తించి వెంటనే తన తల్లిదండ్రులను నిద్రలేపాడు. అనంతరం ఆ భవనంలో నివసిస్తున్న మిగతావాళ్లను సైతం నిద్రలేపి బయటకు వెళ్లాలంటూ కేకలు పెట్టాడు. అంతా బయటకు వచ్చిన కొన్ని క్షణాల్లోనే భవనం కుప్పకూలింది. దీంతో అంతా హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. కునాల్ వల్లే తాము ప్రాణాలతో బయటపడ్డామని అంటున్నారు.
Read Also: పామును పెళ్లి చేసుకున్న యువకుడు.. రెండో చూపులోనే ప్రేమ!
అయితే, ఆ భవనం శిథిల స్థితికి చేరిందని, వెంటనే ఖాళీ చేయాలని అధికారులు తొమ్మిది నెలల కిందటే హెచ్చరించారు. అంతా నిరుపేదలు కావడం వల్ల ఆ భవనాన్ని వదిలి బయటకు వెళ్లలేకపోయారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల భవనం మరింత శిథిల స్థితికి చేరుకుంది. చివరికి.. కుప్పకూలింది. దీంతో ఆ పేదలు నీడ కోల్పోయారు.