యాప్నగరం

జైల్లో ఆ ఒక్కడే.. 48 మంది ఖైదీలను దారుణంగా చంపేశాడు, ఎందుకంటే..

ఆ ఖైదీ ఏ జైలుకెళ్లినా సరే.. అక్కడ ఒక శవం లేస్తుంది. గత 25 ఏళ్లుగా జైల్లోనే ఉంటున్న ఆ ఖైదీ ఇప్పటివరకు 48 మంది ఖైదీలను చంపేశాడు. ఇంకా చంపుతానని నేరుగా న్యాయమూర్తికే చెబుతున్నాడు.

Samayam Telugu 28 Oct 2020, 7:17 pm
ఖైదీని జైల్లో పెట్టాలంటేనే వణికిపోతున్నారు. ఏ క్షణంలో ఎవరిని హత్య చేస్తాడో తెలియక అతడిని ఒంటరిగా బందిస్తున్నారు. చైన్లతో కట్టేస్తున్నారు. ఎందుకంటే.. ఇతడు ఇప్పటివరకు వివిధ నేరాలతో శిక్ష అనుభవిస్తున్న 48 మంది ఖైదీలను దారుణంగా హత్య చేశాడు. కొంతమంది ఖైదీలనైతే.. మొండెం నుంచి తలను వేరు చేసి అత్యంత క్రూరంగా చంపేశాడు. ఇంతకీ ఈ ఖైదీ ఎవరు? అతడు తోటి ఖైదీలను ఎందుకు చంపేస్తున్నాడు? అసలు అతడు జైలుకు ఎందుకు వెళ్లాడు తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు.
Samayam Telugu Image by Pixabay


జైలు సిబ్బందిని గజగజా వణికిస్తున్న ఈ కిలాడీ ఖైదీ పేరు మార్కోస్ పౌలో దా సిల్వా. సీరియల్ హత్యల తర్వాత అతడిని అంతా ‘లుసీఫర్’ అని పిలుస్తున్నారు. 18 ఏళ్ల వయస్సులో చిల్లర దొంగతనాలు చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. అలా జైల్లో అడుగుపెట్టిన అతడికి అకస్మాత్తుగా ఏమైందో ఏమో.. తోటి ఖైదీలను చంపేస్తూ జైల్లోనే శిక్షల మీద శిక్ష అనుభవిస్తున్నాడు. 1995లో జైల్లో అడుగు పెట్టిన లుసీఫర్.. మళ్లీ బయట అడుగుపెట్టలేదు. 2011లో బ్రెజిల్‌లోని సావో పాలో జైల్లో ఒకేసారి ఐదుగురి ఖైదీలను హత్య చేసి వార్తల్లోకి ఎక్కాడు.

Read Also: ఫుట్‌పాత్‌పై సెక్స్.. లాక్‌డౌన్‌లో ఉద్యోగం పోయిందని.. (వీడియో)

అలా హత్యల తర్వాత హత్యలు చేస్తూ సీరియల్ కిల్లర్‌గా పేరొందిన లుసీఫర్‌‌‌కు ఇప్పటివరకు పడిన జైలు శిక్షల మొత్తం 217 ఏళ్లు. ఇవి కాకుండా మరికొన్ని హత్య కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి. ఇటీవల ఓ కేసు విచారణలో భాగంగా లుసీఫర్ జడ్జితో మాట్లాడుతూ.. ‘‘అంతమందిని చంపినందుకు నాకు ఎలాంటి పశ్చాతాపం లేదు. వాళ్లంతా రేపిస్టులు, దొంగలు. వారు ఇతర ఖైదీలను దోచుకొనేవారు. వారి ఆగడాలు సంహించలేకే వాళ్లను చంపేశాను’’ అని తెలిపాడు. అయితే, ఇప్పటివరకు లుసీఫర్ చేసిన హత్యల హిస్టరీ బయట ప్రపంచానికి తెలీదు. ఇటీవలే దక్షిణ అమెరికాకు చెందిన UOL అనే మీడియా సంస్థ అతడి నేరాల చిట్టా బయటపెట్టింది.

Read Also: కుక్క నాకడంతో కాళ్లు, చేతులు పోగొట్టుకున్న మహిళ!

హత్యల నేపథ్యంలో.. లుసీఫర్‌ను తిప్పని జైలంటూ ఏదీ లేదు. కానీ, ఏ జైలుకెళ్లి.. సంకెళ్లు వేసి కట్టేసినా హత్యలు మాత్రం ఆపేవాడు కాదు. మంచిగా నటిస్తూ.. జైలు సిబ్బందని తప్పుదోవ పట్టించేవాడు. వారు అప్రమత్తంగా లేని సమయంలో హత్యలకు పాల్పడేవాడు. సెర్రా అజుల్ జైల్లో.. అతడు మంటలను ఆర్పేందుకు ఉపయోగించే సిలిండర్‌తో ఖైదీల తలలు పగలగొట్టాడు. జైల్లో తయారు చేసుకున్న కత్తితో ఖైదీల తలలను మొండెం నుంచి వేరు చేసేవాడు. అయితే, అతడు చంపింది చాలా తక్కువ మందిని అని, ఇంకా చాలామందిని హత్య చేయాల్సి ఉందని అతడు తెలపడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.