యాప్నగరం

వీడియో: రైలు పట్టాలపై నిలుచుని ఫొటోలు.. వేగంగా దూసుకొచ్చిన రైలు, సెకన్లలో..

రైలు పట్టాలపై నిలుచుని ఫొటోలు తీసుకోవడం ఎంత ప్రమాదమో తెలుసా? ఇదిగో ఈ కుటుంబం అదే చేసింది. చివరికి, సెకన్ల వ్యవధిలో..

Samayam Telugu 27 Feb 2020, 7:06 pm
రైల్వే ట్రాక్‌పై ఫొటోలు తీసుకోవడం బాగానే ఉంటుంది. కానీ, అలా చేయడం ప్రాణాలకే ప్రమాదకరం. పెన్సిల్వినియాకు చెందిన ఓ కుటుంబం ఫొటోల కోసం చేసిన ఈ సాహసాన్ని చూస్తే గుండె జారుతుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు రైల్వే ట్రాక్ మీదకు వచ్చి ఫొటోలు దిగారు. పెద్దలంతా ఫొటోలు తీయిచుకోవడంలో బిజీగా ఉంటే.. పిల్లలు మాత్రం రైల్వే ట్రాక్‌ల మీద ఆటల్లో మునిగితేలారు.
Samayam Telugu rail track pictures nearly turned into a family tragedy
వీడియో: రైలు పట్టాలపై నిలుచుని ఫొటోలు.. వేగంగా దూసుకొచ్చిన రైలు, సెకన్లలో..


దూసుకొచ్చిన రైలు..

వాళ్లంతా ఫొటోలు తీసుకోవడంలో నిమగ్నమై ఉండగా.. ఓ రైలు ఆకస్మాత్తుగా అటువైపు దూసుకొచ్చింది. వారంతా ఆ ట్రాక్ మలుపులో ఉండటం వల్ల వారికి రైలు వస్తున్నట్లు తెలియలేదు. అది దగ్గరకు వస్తుందనగా ఎవరి దారిలో వారు పరుగులు పెట్టారు. ఒక పిల్లాడు ట్రాక్ మీదే ఉండిపోవడంతో ఓ వ్యక్తి పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ పిల్లాడిని పట్టుకుని ట్రాక్ దాటాడు. ఆ వెంటనే ఆ రైలు వారి పక్క నుంచి వెళ్లిపోయింది. వారంతా సెకన్ల వ్యవధిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

సోషల్ మీడియాలో వైరల్

ఈ ఘటన రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాక్‌లపై ఫొటోలు దిగడం, నడవడం చాలా ప్రమాదకరమని, రైలు వేగం.. టైమ్‌ను అంచనా వేయడం చాలా కష్టమని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి సాహసాలు చేయొద్దని హెచ్చరించారు. (సీసీటీవీ విడియోను కింది స్లైడ్‌లో చూడగలరు).

[Watch Also: కారును ఢీకొట్టి పల్టీ కొట్టిన లారీ.. సెకన్లలో విధ్వంసం, వీడియో వైరల్]

Youtube-Family on Tracks Barely Escapes Fast Moving Train! Greencastle, PA

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.