యాప్నగరం

ఎర్రగా మారిన ఇండోనేషియా ఆకాశం.. చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి!

ఆకాశంలో మార్డర్ జరిగిందన్నట్లుగా ఆ ప్రాంతం ఎర్రగా మారిపోయింది. ఈ భిన్న వాతావరణం వల్ల అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకోడానికి కూడా ఇబ్బందిపడ్డారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది?

Samayam Telugu 25 Sep 2019, 8:45 pm
‘‘ఆకాశం చూశావా, పైనేదో మర్డర్ జరిగినట్లు లేదు’’ డైలాగ్ గుర్తుందా? ‘ముత్యాల ముగ్గు’ సినిమాలో రావు గోపాల రావు చెప్పిన డైలాగు ఇండోనేషియాకు అచ్చు గుద్దినట్లు సరిపోతుంది. సాధారణంగా సంధ్యా సమయంలో సూర్యుడి ఎర్రబడటం వల్ల జాంబీ ప్రాంతంలో ఆకాశం ఎర్రగా మారుతుందనే సంగతి తెలిసిందే. కానీ, అక్కడ పట్టపగలే ఎర్రబారింది.
Samayam Telugu Untitled


Read also: బాబోయ్ ఇదేం జీవి?.. చెట్టు వేర్ల తరహా శరీరంతో వణికిస్తున్న కీటకం

ఆ రంగు వల్ల పరిసర ప్రాంతాలన్నీ ఎర్రగానే కనిపించాయి. దీంతో స్థానికులు ఈ అరుదైన ఘటనను వీడియోలు, ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆకాశం ఇలా ఎర్ర రంగు పులుముకోవడానికి కారణం సూర్యుడు కాదని, అక్కడ అడవులు దహనం కావడమేనని పర్యావరణవేత్తలు పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. ‘‘ఇది అంగారక గ్రహం కాదు, మన భూమి పట్టపగలే పరిసరాలు ఎంత ఎర్రగా మారాయో చూడండి’’ అని ఓ ట్విట్టర్ యూజర్ కామెంట్ చేశాడు. ‘‘ఎర్రదనమే కాదు.. ఆ ప్రాంతాన్ని దట్టమై పొగ కూడా ఆవరించింది.
ఈ వాతావరణం వల్ల మేం ఊపిరి పీల్చుకోలేక ఇబ్బంది పడ్డాం’’ అని మరికొందరు తెలిపారు. దీనిపై కోపర్నికస్ వాతావరణ పర్యవేక్షణ సంస్థ (CAMS) స్పందిస్తూ.. వేలాది ఎకరాలు అటవీ ప్రాంతాలు అగ్నికి ఆహుతి కావడం వల్ల ఇలాంటి వాతావరణం ఏర్పడిందని తెలిపింది.

Read also: TCS ఉద్యోగిని ఆత్మహత్య.. సీసీటీవీలో దృశ్యాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.