యాప్నగరం

Video: వద్దుబాబోయ్!.. చాక్లెట్ స్వీట్‌కార్న్‌‌పై నెటిజన్ల ఫైర్

ఈ మధ్య కొత్త రుచుల పేరుతో రకరకాల పదార్థాలు కలిపేసి... అరాచకం చేస్తున్నారని రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ కార్నర్లపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తాజాగా ఆ లిస్టులో మరొకటి చేరింది.

Samayam Telugu 18 Nov 2021, 10:50 am
మనం భోజనం చేసేటప్పుడు అన్నంలో పప్పు, చట్నీ, పెరుగు, రసం ఇలా అన్నీ ఒకేసారి కలిపేసుకొని తింటామా... తినం కదా... ఎందుకంటే దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది. అది మితిమీరితే కడుపులో తిప్పుతుందే తప్ప తిన్నది అరగదు. కానీ ఈమధ్య కొత్త రుచులు, కొత్త వరైటీలు అంటూ చాలా మంది స్ట్రీట్ ఫుడ్ సెల్లర్లు, రెస్టారెంట్ల వారు ఫుడ్‌తో రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఆటోమేటిక్‌గా వాటిని నెటిజన్లు తిప్పికొడుతున్నారు. తాజాగా ఆ లిస్టులో చేరిన స్వీట్‌కార్న్ కథ కూడా అలాగే ఉంది. మనం స్వీట్‌కార్న్‌ని అలా తింటేనే బాగుంటుంది కదా... కావాలంటే దానిపై కాస్త వెన్న, నిమ్మరసం, ఉప్పు, కారం వంటివి వేసుకొని తింటాం.... అంతవరకూ ఓకే... కానీ ఢిల్లీలోని ఓ స్ట్రీట్ ఫుడ్ సెల్లర్... స్వీట్‌కార్న్‌పై చాక్లెట్, మసాలా, డల్లాప్స్ క్రీమ్, నిమ్మరసం కలిపి ఇస్తున్నాడు (chocolate masala sweet corn). అది చూసి నెటిజన్లు భగ్గుమంటున్నారు.
Samayam Telugu చాక్లెట్ స్వీట్‌కార్న్‌ (image credit - instagram - anikaitluthra)


ఇన్‌స్టాగ్రామ్‌లో వ్లాగర్ అనికైత్ లుథారా... ఈ వీడియోని పోస్ట్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు బాబోయ్ అంటున్నారు. ఎందుకొచ్చిన ప్రయోగాలు అని తిట్టిపోస్తున్నారు (street food video).

ఆ వీడియో (viral video)ని ఇక్కడ చూడండి
View this post on Instagram A post shared by mr_craver by Anikait Luthra (@anikaitluthra)

నెటిజన్లు ఇంతలా ఆగ్రహించడానికి బలమైన కారణం ఉంది. మొక్కజొన్న అనేది అంత త్వరగా అరగదు. కాబట్టే దానికి మనం నిమ్మరసం జోడిస్తాం. నిమ్మరసంలో సీ విటమిన్ ఉంటుంది. ఇదోరకమైన యాసిడ్. ఇది పొట్టలోకి వెళ్లినప్పుడు... యాసిడ్ కారణంగా... ఆహారంలో కదలిక ఎక్కువగా ఉంటుంది. తద్వారా త్వరగా అరుగుతుంది. కానీ ఢిల్లీ సెల్లర్ చేసిన పని వల్ల పొట్టలో నిమ్మరసం యాసిడ్‌కి చాక్లెట్ స్వీట్ మిక్స్ అవుతుంది. దానికి మసాలా చేరి... గందరగోళం అవుతుంది. పొట్టలో తిప్పుతుంది. కడుపునొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ.
River Umngot: ఈ నదిలో రూపాయి వేస్తే ఏమవుతుందో తెలుసా?
ఏ ఆహరమైనా మన పెద్దవాళ్లు చెప్పినట్లు తింటేనే మంచిది. భోజనంలో చివరిగా పెరుగు ఎందుకు తింటారో తెలుసుగా. పెరుగులో... సీ విటమిన్ ఉంటుంది. గట్ బ్యాక్టీరియా ఉంటుంది. చివరిగా పొట్టలోకి వెళ్లే ఆ బ్యాక్టీరియా... మనం తిన్న ఆహారాన్ని మరింత చిన్న ముక్కలుగా, పేస్టులా మార్చేస్తుంది. తద్వారా అది త్వరగా అరిగేలా చేస్తుంది. అందుకే అన్నం తిన్నాక చివర్లో పెరుగు తినమని పెద్దలు చెబుతారు. ఇవన్నీ వాళ్లు తమ అనుభవంతో చెప్పినవి. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఆహారాలతో అడ్డమైన ప్రయోగాలు చేసి... ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. కొత్త రుచుల పేరుతో... ఉన్నవి చెడగొట్టకుండా ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.