యాప్నగరం

తల్లిదండ్రుల సమాధి తవ్వి ఎముకలు ఎత్తుకెళ్లిన కొడుకు!

ఆ వ్యక్తి తన తల్లిదండ్రులు, పినతండ్రి సమాధులను తవ్వాడు. వాటిలోని ఎముకలను సంచిలో వేసుకుని వ్యాపారి దగ్గరకు బయల్దేరాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

Samayam Telugu 18 Nov 2019, 5:29 pm
శ్మశానంలోకి వెళ్లాలంటేనే ఓ రకమైన భయం మనసులో ఏర్పడుతుంది. కానీ, ఆ వ్యక్తి ఏకంగా సమాధులను తవ్వి.. అందులో ఉన్న ఎముకలను ఎత్తుకెళ్ళిపోయాడు. ఈ ఘటన తూర్పు ఆఫ్రికాలోని మొజాంబిక్‌లో చోటుచేసుకుంది.
Samayam Telugu Representational image/Getty Images
Representational image/Getty Images


నాంపులాకు చెందిన ఓ వ్యక్తి (పేరు వెల్లడించలేదు) ఇటీవల శ్మశానంలోకి వెళ్లి తన తల్లిదండ్రులు, తన పిన తండ్రి సమాధులను తవ్వాడు. అనంతరం వారి ఎముకలను మూట కట్టుకుని అమ్మడానికి బయల్దేరాడు. అనుమానస్పదంగా తిరుగుతున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని సోదాలు చేయగా ఎముకలు బయటపడ్డాయి.

Also Read: చనిపోయినా నవ్వించాడు.. అంత్యక్రియల్లో నవ్వులు పూయించిన మృతుడు

పోలీసులు తొలుత అతడు ఎవరినో హత్య చేసి ఉంటాడని భావించారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఓ వ్యాపారి ఎముకలను తీసుకొస్తే రూ.22 వేలు ఇస్తానని చెప్పాడని, అందుకే తన తల్లిదండ్రుల సమాధి నుంచి ఈ ఎముకలు తీసుకొచ్చానని పేర్కొన్నాడు. ఎముకలతో వెళ్లిన తర్వాత ఆ వ్యాపారి కనిపించలేదని తెలిపాడు. ఆ డబ్బుతో తాను బైకు కొనుగోలు చేద్దామనుకున్నా అని తెలిపాడు.

Also Read: శ్మశానంలో సమాధిపై సెక్స్.. కెమేరాకు చిక్కిన పాడుపని!

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ఇలాంటి కేసులో గతంలో కూడా నమోదయ్యాయని తెలిపారు. ఔషదాల తయారీలో ఎముకలను ఉపయోగిస్తామని, ఇందుకు భారీ మొత్తం చెల్లిస్తామని ఆశ చూపుతూ కొందరు ఎముకలు స్మగ్లింగ్ చేస్తున్నారని తెలిపారు. వీటిలో కొన్ని చేతబడులు చేసే వ్యక్తులకు సరఫరా అవుతున్నట్లు తెలిసిందన్నారు. సాధారణంగా సమాధులను తవ్వితే ముక్కుపుటలు అదిరిపోయేంత దుర్వాసన వస్తుంది. కానీ, ఆ వ్యక్తి ఒక్కడే సమాధులను ఎలా తవ్వాడని అంతా ఆశ్చర్యపోతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.