యాప్నగరం

వింత శిశువు.. పంది తల, ఒళ్లంతా పొలుసులు!

ఎంకేసీజీ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌లో పుట్టిన ఆ శిశువు ప్రస్తుతం ప్రాణాలతోనే ఉన్నా.. మరెన్నో రోజులు బతకదని వైద్యులు తెలిపారు. అప్పటివరకు అత్యవసర చికిత్స అందిస్తామన్నారు.

Samayam Telugu 23 Apr 2021, 10:16 pm
డిశాలోని బరంపురంలో వింత శిశువు జన్మించింది. పంది రూపంలో ముఖం, ఒళ్లంతా పొలుసులతో పుట్టిన ఈ బిడ్డను చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. హార్లేక్విన్ ఇచ్థియోసిస్ (Harlequin Ichtyhyosis) అనే అరుదైన జన్యు సమస్య వల్ల ఆ బిడ్డ అలా పుట్టిందని వైద్యులు తెలిపారు.
Samayam Telugu Representational Image


ఎంకేసీజీ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌లో పుట్టిన ఆ శిశువు ప్రస్తుతం ప్రాణాలతోనే ఉన్నా.. మరెన్నో రోజులు బతకదని వైద్యులు తెలిపారు. అప్పటివరకు అత్యవసర చికిత్స అందిస్తామన్నారు. ఓ అధ్యయనం ప్రకారం.. ప్రతి పది లక్షల మంది శిశువుల్లో ఒకరు ఈ విధంగా జన్మిస్తారు. ఈ లోపాలతో జన్మించే పిల్లలు బతికే అవకాశాలు చాలా తక్కువ. 2016లో కూడా ఓ బిడ్డ ఇలాంటి లోపాలతోనే జన్మించింది. కానీ కొద్ది రోజుల్లోనే కన్ను మూసింది.
చంద్రుడిపై శృంగారం.. నాసా ట్రైనీ జైలుపాలు!ప్రస్తుతం ఒడిశాలో 30 ఏళ్ల మహిళకు పుట్టిన ఈ బిడ్డకు నోరు, కళ్లు, చెవులు వింతగా ఉన్నాయి. చూసేందుకు పంది రూపంలో ఉన్నాయి. ఫలితంగా ఆ బిడ్డ తినడానికి, గాలి పీల్చడానికి ఇబ్బంది పడుతోంది. ప్రస్తుతం చిన్నారిని ఐసీయూలో ఉంచారు. తల్లి ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఏప్రిల్ 22 రాత్రి ఆమె తీవ్రమైన నొప్పులతో హాస్పిటల్‌లో చేరిందని, ఎనిమిదో నెలలోనే బిడ్డకు జన్మనిచ్చిందన్నారు. ఆమె ఇప్పటివరకు నాలుగు సార్లు గర్భం దాల్చిందని, ఇదివరకు పుట్టిన ఇద్దరు బిడ్డలు చనిపోగా, ఒక బిడ్డ మాత్రమే ఆరోగ్యంగా ఉందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.