యాప్నగరం

శవపేటికలో కళ్లు తెరిచిన శవం.. చలిని తట్టుకోలేక బతికిపోయాడట!

చనిపోయిన వ్యక్తి.. చలిని తట్టుకోలేక మళ్లీ బతుకుతాడా? తమిళనాడులో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి తెలిస్తే మీకు ఇదే అనుమానం కలుగుతుంది.

Samayam Telugu 16 Oct 2020, 2:10 pm
నిపోయాడనుకున్న వ్యక్తి.. అకస్మాత్తుగా ప్రాణాలతో లేచి కుర్చుంటే? చాలా ఆశ్చర్యం కలుగుతుంది కదూ. తమిళనాడులోని కందంపట్టిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బాలసుబ్రమణ్యన్ కుమార్(74) అనే పెద్దాయన అకస్మాత్తుగా కన్ను మూశాడు. అతడు ఎంతకీ కదలకపోవడంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సిద్ధం చేశారు. భౌతిక కాయం పాడవ్వకుండా ఉండేందుకు ఓ సంస్థ నుంచి శవ పేటిక తరహా ఫ్రీజర్‌ను అద్దెకు తీసుకున్నారు.
Samayam Telugu శవపేటికలో కళ్లు తెరిచిన శవం, చలిని తట్టుకోలేక..


Read Also: నగ్నంగా ప్రపంచాన్ని చుట్టేస్తున్న జంట.. ఫొటోలు వైరల్

కుమార్‌ను ఆ ఫ్రీజర్‌లో పెట్టి మిగతా బంధువులకు కబురు చేశారు. అలా ఆ శవాన్ని సుమారు 20 గంటలు సేపు అందులోనే ఉంచారు. శవాన్ని అంత్యక్రియలు తీసుకెళ్లేందుకు సిద్ధం చేస్తుండుగా.. ఆ ఫ్రీజర్ తీసుకొచ్చిన సిబ్బంది.. శవంలో కదలిక చూశారు. చేయి వణుకుతున్నట్లుగా కనిపించింది. అదేంటీ... శవం కదులుతోందని పరీక్షించగా కుమార్ ఊపిరి ఆడుతోంది. దీంతో అతడిని హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు.

Read Also: ఛీ.. యాక్, టాయిలెట్ గుంతలోని నీరు తాగి.. బాస్‌ను మెప్పించింది

ఈ ఘటనపై పోలీసులు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న కుమార్‌కు వెంటనే వైద్యం అందించకపోగా, బతికుండగానే చనిపోయాడని నిర్ధరించడం నేరమని పోలీసులు అంటున్నారు. దీనిపై కుటుంబ సభ్యులు వింత వాదన వినిపిస్తున్నారు. ఆ ఫ్రీజర్‌లో చలిని తట్టుకోలేక ప్రాణం తిరిగి వచ్చిందని అంటున్నారు. ఏది ఏమైనా ఆ పెద్దాయన ఆ ఫ్రీజర్‌లో 20 గంటల సేపు చలిని తట్టుకుంటూ ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యకరమే కదూ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.