యాప్నగరం

రూపాయికే కిలో చేపలు.. వ్యాపారి బంపర్ ఆఫర్‌కు పోటెత్తిన జనం!

కనీసం రూ.200 చెల్లిస్తే గానీ కిలో చేప దక్కని రోజులివి. అయితే, ఆ వ్యాపారి ఖరీదైన తాజా చేపలను రూపాయికే అమ్మేశాడు.

Samayam Telugu 11 Nov 2019, 3:59 pm
వ్యాపారం అంటే ఈజీ కాదు. కస్టమర్లతో నిత్యం కళకళ్లాడితేనే.. జేబులు కూడా గలగల్లాడుతాయి. అందుకే, తమిళనాడులోని శివగంగ జిల్లా కరైకుడికి చెందిన చేపల వ్యాపారి పి.మనోహరన్ సరికొత్త ఆఫర్‌తో ఆహార ప్రియులను ఆకట్టుకున్నాడు. కేజీ చేపలను రూపాయికే విక్రయించాడు. దీంతో జనాలు లొట్టలేసుకుంటూ అతడి దుకాణం ముందు క్యూ కట్టారు.
Samayam Telugu GettyImages-984297014


Also Read: మనిషి ముఖంతో చేప.. అబ్బురపరుస్తున్న వైరల్ వీడియో

ఏదైనా ఆఫర్ ప్రకటించారంటే.. అందులో కొన్ని ట్విస్టులు కూడా ఉంటాయి. అందుకే, ఈ వ్యాపారి చూడా చిన్న ట్విస్టు పెట్టాడు. తాను ప్రకటించిన రూపాయికే కిలో చేపల ఆఫర్.. తొలి వందమందికి మాత్రమేనని చెప్పాడు. దీంతో చేపల ప్రియులు తెల్లవారుజాము నుంచే అతడి దుకాణం ముందు క్యూకట్టారు. ఈ ఆఫర్ వల్ల అతడి గల్లా పెట్టి నిండిందో లేదో గానీ.. అతడి వ్యాపారానికి మాత్రం మాంచి ప్రచారం లభించింది. ఈ ఆఫర్ ప్రకటించడానికి కారణం.. రూపాయికే ఇడ్లీలు విక్రయిస్తున్న బామ్మే అని ఆ వ్యాపారి తెలిపాడు. ఈ ఆఫర్ కింద అతడు 520 కేజీల చేపలను అమ్మినట్లు తెలిపాడు.

Watch Video: మెట్రో రైలులో యువ జంట ముద్దులు.. అంతా చూస్తుండగానే పాడుపని!

ఈ సందర్భంగా మనోహరన్ మాట్లాడుతూ.. ‘‘స్టోరేజ్‌లో పెట్టిన చేపలను అమ్మడం నాకు ఇష్టం లేదు. ఎప్పటికప్పుడు తాజా చేపలనే విక్రయిస్తాను. చేపలు తినడం ఆరోగ్యానికి మంచిది తెలిపేందుకే ఈ ఆఫర్ ప్రకటించాను. కరైకుడిలోని బర్మ కాలనీలో ఏర్పాటుచేసిన దుకాణంలో తొలి వంద మందికి మాత్రమే రూపాయికి కిలో చేపలు ఇస్తానని ప్రకటించాను. కానీ, అక్కడికి 500 మందికి పైగా వచ్చారు. దీంతో అందరికీ రూపాయికే కిలో చేపలను ఇచ్చేశాను’’ అని తెలిపాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.