యాప్నగరం

ఇంట్లోకి దూరి.. మంచంపై పడుకుని రెస్ట్ తీసుకున్న పులి!

దారితప్పిన ఓ పులి జనవాసాల్లోకి ప్రవేశించింది. ఓ ఇంట్లోకి దూరి మంచంపై ఇలా పవళించి సేద తీరింది.

Samayam Telugu 19 Jul 2019, 3:46 pm
పులి బాగా అలసిపోయిందో ఏమో ఓ దుకాణంలోకి దూరి.. లోపల ఉన్న బెడ్ మీద సేదతీరింది. ఈ ఘటన అస్సాంలోని నాగోన్ జిల్లా బగోరీలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి సమీపంలో కాజీరంగా జాతీయ పార్కు ఉంది. భారీ వరదల వల్ల ఆ ప్రాంతమంతా మునిగిపోయింది. దీంతో జంతువులు జనావాసాల్లోకి చేరి తలదాచుకుంటున్నాయి.
Samayam Telugu 1563459864-tiger_kaziranga_2


ఈ నేపథ్యంలో ఓ రాయల్ బెంగాల్ టైగర్ వరద నీటిలో ఈదుతూ పర్వతంపై ఉన్న ఊర్లోకి చేరింది. లోహ వ్యర్థాలను ఉంచే గ్యారేజ్‌ గోడ దూకి లోపలికి ప్రవేశించింది. అనంతరం ఓ గదిలోకి వెళ్లి మంచంపై సేద తీరింది. ఈ సందర్భంగా దుకాణదారుడు మోతీలాల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జనాలంతా పులి.. పులి.. అంటూ కేకలు పెట్టారు. అప్రమత్తమై చూసేసరికి 20 అడుగుల దూరంలోనే పులి కనిపించింది. దీంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే, అది నన్నేమీ చేయకుండా నేరుగా దుకాణంలోకి వెళ్లి మంచంపై పడుకుంది. ఆ పులి సుమారు 10 గంటలు దుకాణంలోనే గడిపింది. ఆ తర్వాత అడవుల్లోకి వెళ్లిపోయింది. అయితే, అది ఎవరికీ హాని చేయకపోవడం గమనార్హం. పులి మాత్రమే కాదు జింకలు తదితర జంతువులు కూడా ఈ గ్రామంలోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.