యాప్నగరం

ట్రాక్టర్ డ్రైవర్‌కు రూ.59,000 జరిమానా.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన ఫలితం!

New Traffic Rules | ట్రాఫిక్ చలానాలు నడ్డివిరుస్తున్నాయి. వాటిని చెల్లించాలంటే ఆస్తులు అమ్ముకోవల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కొత్త రూల్స్ వచ్చిన తర్వాత ప్రజలు వాహనాలు బయటకు తీయాలంటేనే భయపడిపోతున్నారు.

Samayam Telugu 4 Sep 2019, 9:18 pm
కొత్త ట్రాఫిక్ నిబంధనలు ప్రజలను వణికిస్తున్నాయి. ఈ రూల్స్ అమల్లోకి వచ్చిన మొదటి రోజే 13 వేల స్కూటీలోకి రూ.23 వేల చలానా విధించడం చర్చనీయమైంది. తాజాగా గుర్గావ్‌కు చెందిన ఓ ట్రాక్టర్ డ్రైవర్‌కు రూ.59 వేల జరిమానా విధించడం మళ్లీ చర్చనీయమైంది. దీంతో ప్రజలకు తమ వాహనాలను బయటకు తీయడానికే భయపడుతున్నారు.
Samayam Telugu 3_1475646434


Read also: అంతరిక్షంలో హోటల్.. భూమిని చూస్తూ హాయిగా గడిపేయొచ్చు! (ఫొటోలు)

రాం గోపాల్ అనే వ్యక్తి ఇప్పటివరకు 10 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగించాడు. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సురెన్స్, వాహనానికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తదితరాలు లేకపోవడం, ప్రమాదకర డ్రైవింగ్, పోలీసులతో అమర్యాదగా ప్రవర్తించడం, ట్రాఫిక్ సిగ్నల్ ఉల్లంఘనల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు రూ.59 వేల జరిమానా విధించి షాకిచ్చారు.

Read also: ఆంధ్రా బ్యాంక్ విలీనం.. ‘ఆ సీత తెచ్చెన్, ఈ సీత మూయించెన్’

ఆటో రిక్షాకు రూ.47వేల జరిమానా: మరోవైపు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో కూడా ట్రాఫిక్ జరిమానాలు భయపెడుతున్నాయి. రూల్స్ పాటించని ఓ ఆటో రిక్షా డ్రైవర్‌కు రూ.47,500 చలానా విధించారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికిల్ ఇన్సురెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోవడంతో భారీ జరిమానా విధించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.