యాప్నగరం

Video: కదిలే రైల్లోంచీ దిగాడు.. అంతే.. ఇలా అయ్యింది!

Train accident Video: మన కంగారే మన ప్రాణాల మీదకు తేగలదు. ఆ ప్రయాణికుడు చేసిన తప్పు... అతని ప్రాణాలకు ముప్పుగా మారింది. ఈ ఘటనపై రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసుకుందాం.

Samayam Telugu 16 Nov 2021, 1:22 pm
మనలో చాలా మందికి బస్టాండ్‌లో బస్సు ఆగకముందే... దిగిపోవడం అలవాటు. అలా దిగడాన్ని ఓ ఛాలెంజ్‌లా తీసుకుంటారు కొందరు. అది ప్రమాదకరమే అయినప్పటికీ... బస్సులో మూమెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి... చాలా సందర్భాల్లో అలా దిగిన వారికి ఏమీ కాదు. కానీ ఈ రూల్ ట్రైన్ జర్నీలో వర్తించదు. ఎందుకంటే... రైలులో ప్రయాణించేవారికి ప్రత్యేకమైన మూవింగ్ ఫోర్స్ ఉంటుంది. అందువల్ల ప్లాట్‌ఫామ్ దగ్గరకు రైలు వస్తున్నప్పుడు... అది ఆగేవరకూ ఆగాలే తప్ప... కదిలే రైలు నుంచి ప్లాట్‌ఫామ్ పైకి దూకేయాలని ప్రయత్నించకూడదు. అలా చేస్తే... మూవింగ్ ఫోర్సులో తేడా ఏర్పడి.. ప్రయాణికుడు కింద పడే ప్రమాదం ఉంటుంది. ఈ ఘటనలో సరిగ్గా అలాగే జరిగింది. (Train accident Video)
Samayam Telugu కదిలే రైలు నుంచి దిగుతూ... (image credit - twitter - @drmmumbaicr)


నవంబర్ 14. టైమ్ ఉదయం 11.54 అయ్యింది. హౌరా-ముంబై స్పెషల్ ట్రైను (Howrah-Mumbai Special train)... మహారాష్ట్రలోని కళ్యాణ్ రైల్వేస్టేషన్‌ (Kalyan station)కి వస్తూ ఉంది. రైలు ఆగగానే ఎక్కుదామని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి గబగబా రైల్లోంచీ ప్లాట్‌ఫామ్‌పైకి దూకాడు. కానీ మూవింగ్ ఫోర్స్ తేడా వచ్చి... రైలుకీ, ప్లాట్‌ఫామ్‌కీ మధ్యలో పడిపోయాడు. అతను రైలు వేగానికి దొర్లుతూ... ఇబ్బంది పడుతుంటే... అది గమనించిన ప్రయాణికులు వేగంగా అతని దగ్గరకు పరుగులు పెట్టారు. ఇంతలో రైలు లోపలి ప్రయాణికులు చైన్ లాగడంతో రైలు ఆగింది. తర్వాత అందరూ కలిసి అతన్ని జాగ్రత్తగా పైకి లాగారు. ఆస్పత్రికి తరలించారు.

ఈ సీసీటీవీ ఫుటేజ్ వీడియో (CCTV footage video)ని స్వయంగా సెంట్రల్ రైల్వే... తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. పడిపోయిన వ్యక్తిని శివాజీ సింగ్ అని తెలిపింది.

ఈ కళ్యాణ్ స్టేషన్‌లో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈమధ్యే ఓ జంట... రాంగ్ ట్రైన్ ఎక్కి... అది బయలుదేరుతున్నప్పుడు ప్లాట్‌ఫామ్ పైకి దూకేందుకు ప్రయత్నించింది. అమ్మాయి దూకుతూ పడిపోయింది. వెంటనే అక్కడి రైల్వే పోలీసు ఆమెను కాపాడాడు. అందుకే ప్రజల్లో అవగాహన పెంచేందుకు రైల్వే శాఖ ఈ వీడియోని పోస్ట్ చేసింది.

రైలు నిమిషం ఆలస్యమైందని డ్రైవర్ శాలరీ కట్.. జపాన్‌లో అంతేనా.!
ఎంత బిజీ పనులు ఉన్నా... ఇలా దూకేసి... ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని నెటిజన్లు కోరుతున్నారు. ఓ నిమిషం ఆలస్యమైతే... జీవితంలో కలిగే నష్టమేమీ ఉండదనీ... అదే ప్రాణం పోయినా... అవయవాలు పోయినా... జీవితాంతం బాధపడతూ ఉండాల్సి వస్తుందని అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.