యాప్నగరం

హైదరాబాద్‌లో వింత ఘటన.. రెండు తలల శిశువు మృతి

హైదరాబాద్‌లో ఓ మహిళ కడుపులో పెరుగుతున్న రెండు తలల శిశువును వైద్యులు శస్త్రచికిత్సతో బయటకు తీశారు.

Samayam Telugu 21 Apr 2019, 12:57 am
హైదరాబాద్‌లోని డాంగోరియి ఆస్పత్రిలో ఓ గర్భిణికి ఆపరేషన్ చేసిన వైద్యులు రెండు తలల మృత శిశువును బయటకు తీశారు. నగరంలో ముషీరాబాద్ బాపూజీ నగర్‌లో నివాసం ఉంటున్న ఓ గర్భిణీ నాలుగో నెలలో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని స్కానింగ్ సెంటర్‌లో అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయించుకుంది. ఈ సందర్భంగా కడుపులో శిశువుకు రెండు తలలు ఉన్నట్లు గుర్తించారు.
Samayam Telugu index


తలలు మాత్రమే కాకుండా శిశువు శరీరంలోని గుండె, మెదడులో కూడా లోపాలు ఉన్నట్టు కనుగొన్నారు. శిశువులో కదలిక కూడా లేకపోవడంతో వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ సాయి లీల ఆధ్వర్యంలో ఆమెకు ఆపరేషన్ చేసి మృత శిశువును బయటకు తీశారు.

ఇది వైద్య చరిత్రలో చాలా అరుదైన ఘటన అని, కోటి మందిలో ఒకరికి మాత్రమే ఇలాంటి జన్యుపరమైన సమస్య వస్తుందని వైద్యులు తెలిపారు. ఒక వేళ ఈ బిడ్డ ప్రాణాలతో జన్మించినా శరీరక లోపాల వల్ల బతకడం కష్టమన్నారు. అయితే, పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కలలు కన్న ఆ దంపతులు శిశువు మరణంతో కన్నీరు మున్నీరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.