యాప్నగరం

షాకింగ్.. 178 యూనిట్లకు రూ.23 కోట్ల కరెంట్ బిల్లు!

బిల్లు చూసి గొల్లుమన్న వినియోగదారుడు. జీవితాంతం కష్టపడినా.. ఆ బిల్లు కట్టలేనంటూ గగ్గోలు!

Samayam Telugu 23 Jan 2019, 7:28 pm
రెంటే కాదు.. ఒక్కోసారి కరెంట్ బిల్లులు కూడా షాక్ కొడతాయి. ఉత్తర ప్రదేశ్‌లోని కనౌజు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఈ నెల వచ్చిన కరెంటు బిల్లు చూడగానే అతడికి గుండె ఆగినంత పనైంది. దీంతో ఆ వ్యక్తి బిల్లు పట్టుకుని విద్యుత్ కార్యాలయానికి పరుగులు పెట్టాడు.
Samayam Telugu 9jvch0n_kannauj-uttar-pradesh-electricity-bill-ani_625x300_23_January_19


అబ్దుల్ బసిత్ అనే చిరు ఉద్యోగికి గత నెల మొత్తం178 యూనిట్ల విద్యుత్తు ఖర్చు చేయగా.. దానికి రూ.23,67,71,524 (రూ.23.67 కోట్లు) బిల్లు వచ్చింది. ఈ సందర్భంగా బసిత్ మాట్లాడుతూ.. ‘‘ఉత్తరప్రదేశ్‌ ప్రజలు చెల్లించాల్సిన మొత్తం బిల్లు నాకే వచ్చినట్లుంది. నా జీవితాంతం కష్టపడినా ఇంత మొత్తాన్ని చెల్లించలేను’’ అని తెలిపాడు.

దీనిపై ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శాదాబ్ అహ్మద్ స్పందిస్తూ.. ‘‘రీడింగ్ సమయంలో కొన్ని లోపాలు తలెత్తుతూ ఉంటాయి. వినియోగదారుడి ఫిర్యాదు మేరకు మళ్లీ రీడింగ్ తీసుకుని సమస్య పరిష్కరిస్తాం. రెండో సారి తీసుకున్న బిల్లులో ఎటువంటి లోపాలు లేనట్లయితే.. ఆ మొత్తాన్ని మాత్రమే చెల్లించాలని కోరతాం’’ అని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.