యాప్నగరం

గుడ్డు తింటుంటే గుండె ఆగింది.. ప్రాణం తీసిన ‘50 ఎగ్ ఛాలెంజ్’

స్నేహితుడి మీద పంతంతో రూ.2 వేలుకు పందెం గట్టాడు. వరుసగా 41 గుడ్లు తిన్నాడు. 42వ గుడ్డు తింటూ కుప్పకూలాడు.

Samayam Telugu 5 Nov 2019, 10:32 am
గుడ్డు ఆరోగ్యానికి మంచిదే. కానీ, దానితో ఆటలాడితేనే అత్యంత ప్రమాదం. ఇందుకు ఈ ఘటన విషాద ఘటనే నిదర్శనం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుభాష్ యాదవ్ అనే 42 ఏళ్ల వ్యక్తి తన స్నేహితుడితో కలిసి బజారుకు వెళ్లాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య గుడ్లు తినే విషయం మీద వా గ్వాదం జరిగింది. దీంతో ఎవరు ఎన్ని గుడ్లు తింటారో తేల్చుకుందామని పందెం కట్టారు.
Samayam Telugu GettyImages-185095911


Also Read: కోడి గుడ్లు పేలి ఆసుపత్రిపాలైన యువతి.. ఆ పొరపాటే కొంప ముంచింది

ఆగకుండా 50 గుడ్లు తింటే రూ.2 వేలు ఇస్తానని స్నేహితుడు సవాల్ విసిరాడు. దీంతో సుభాష్.. గుడ్లు తినడం ప్రారంభించాడు. అలా 41 గుడ్లను మింగేశాడు. 42వ గుడ్డు మింగుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. ఎంతకీ కదలిక లేకపోవడంతో హుటాహుటిన సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. గంట తర్వాత ప్రాణాలతో పోరాడి చనిపోయాడు. గుడ్లు అతిగా తినడం వల్లే సుభాష్ చనిపోయాడని వైద్యులు తెలిపారు.

Also Read: అర్ధరాత్రి ఇంట్లో వింత శబ్దాలు.. బాత్రూమ్ తలుపు తెరిచి చూసి షాక్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.