యాప్నగరం

గర్భాన్ని కిడ్నీలో రాళ్లనుకుంది.. చికిత్సకెళ్లి ముగ్గురిని ప్రసవించింది!

తాను గర్భవతి అని తెలియని ఓ మహిళ.. తన కిడ్నీలో రాళ్లు పెరుగుతున్నాయని వైద్యులను ఆశ్రయించింది. అవి రాళ్లు కాదు.. శిశువులని తెలిసి షాకైంది.

Samayam Telugu 17 Oct 2019, 6:44 pm
మహిళ కిడ్నీలో రాళ్లు ఉన్నాయనే భ్రమతో వైద్యులను ఆశ్రయించింది. అవి రాళ్లు కావు.. కడుపులో పెరుగుతున్న శిశువులని తెలుసుకుని షాకైంది. చివరికి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ వింత ఘటన అమెరికాలోని సౌత్ దకోటాలో చోటుచేసుకుంది. గిప్సీ అనే మహిళ గర్భం దాల్చినా.. ఆ లక్షణాలేవీ కనిపించలేదు. దీంతో ఆమె సాధారణ జీవితం గడపసాగింది.
Samayam Telugu GettyImages-1129150323


ఆమె కడుపు కూడా పెద్దగా పెరగకపోవడంతో ఆమెకు అనుమానమే కలగలేదు. 34 వారాలు గడిచిన తర్వాత ఆమె కిడ్నీల వద్ద నొప్పి కలిగింది. పైగా కడుపు కూడా అక్కడ ఉబ్బినట్లు కనిపించింది. దీంతో కిడ్నీలో రాళ్లు ఉన్నాయనే అనుమానంతో హాస్పిటల్‌కు వెళ్లింది. ఆ తర్వాత నొప్పులు మరింత ఎక్కువయ్యాయి. ఆమెకు స్కానింగ్ చేసిన వైద్యులు కడుపులో కవల పిల్లలు ఉన్నారని చెప్పారు. దీంతో గిప్సీ షాకైంది. ఎలా స్పందించాలో అర్థం కాలేదు. నొప్పులు తీవ్రం కావడం.. పిల్లలను ప్రసవించడం క్షణాల్లో జరిగిపోయింది. అయితే, ఆమెకు పుట్టింది కవలలు కాదు. ముచ్చటగా ముగ్గురు శిశువులు పుట్టారు. వీరిలో ఒకరు అబ్బాయి.

Read also: రాత్రికి రాత్రే గర్భవతి.. 45 నిమిషాల్లో బిడ్డ ప్రసవం!

‘‘నా కడుపులో ముగ్గురు పిల్లలు పెరుగుతున్నా నాకు తెలియలేదంటే చాలా షాకింగ్‌గా ఉంది. 34 వారాలు తాను గర్భవతిగా ఉండి కూడా ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయాను. కనీసం ఆ లక్షణాలు కూడా కనిపించకపోవడం విచిత్రంగా ఉంది’’ అని గిప్సీ తెలిపింది. దీనిపై ఆమె భర్త నిక్కీ మాత్రం చాలా కూల్‌గా స్పందించాడు. ‘‘వైద్యులు కవలలు అని చెప్పగానే వారికి ఏం పేర్లు పెట్టాలనే ఆలోచనలో పడ్డాను. రెండు పేర్లు సిద్ధం చేసేసరికి.. నర్సులు వచ్చి ముగ్గురు పిల్లలు అన్నారు. దీంతో ఆశ్చర్యం వేసింది. మూడో పేరు కోసం మళ్లీ ఆలోచన పడ్డాను’’ అని ఫన్నీగా సమాధానం ఇచ్చాడు.

Read also: అద్భుతం.. బిడ్డను ప్రసవించిన 26 రోజుల్లో కవలలకు జన్మనిచ్చిన మహిళ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.