యాప్నగరం

22 ఏళ్ల తర్వాత కూడా చెక్కుచెదరని శవం, యూపీలో మిరాకిల్!

శవాన్ని పాతిపెట్టిన తర్వాతి రోజు నుంచే కుళ్లిపోవడం మొదలవుతుంది. కానీ, ఆ శవం మాత్రం 22 ఏళ్లయినా చెక్కుచెదరలేదు. ఈ చిత్రం యూపీలో చోటుచేసుకుంది.

Samayam Telugu 23 Aug 2019, 3:47 pm
త్తరప్రదేశ్‌లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. 22 ఏళ్ల కిందట పాతిపెట్టిన శవం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. దీంతో స్థానిక ప్రజలు ఆ శవాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. బందా జిల్లా బబేరు ప్రాంతంలోని అత్తార రోడ్‌లో ఓ స్మశానం ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ ప్రాంతం మునిగిపోయింది. దీంతో మట్టంతా కొట్టుకుపోయి ఓ శవపేటిక పైకి లేచింది.
Samayam Telugu embed_15d14959060


ఈ నేపథ్యంలో స్మశానం కమిటీ సభ్యులు దాన్ని శుభ్రం చేసి తిరిగి పాతిపెట్టాలని భావించారు. ఈ సందర్భంగా శవపేటిక తెరిచి చూస్తే.. అందులో శవం చెక్కుచెదరకుండా కనిపించింది. ఈ విషయం ఊరంతా పాకింది. దీంతో స్థానికులు ఆ శవం ఎవరిదో తెలుసుకోడానికి స్మశానానికి వచ్చారు. చివరికి అది నాసిర్ అహ్మద్ అనే వ్యక్తిదని తెలిసింది. 22 ఏళ్ల కిందట చనిపోయిన అతడిని ఈ స్మశాన వాటికలోనే పూడ్చిపెట్టామని నాసిర్ బంధువు ఒకరు చెప్పారు. ఇప్పటికీ అతడి భౌతిక కాయం కుళ్లిపోకుండా అలాగే ఉండటం ఆశ్చర్యంగా ఉందన్నారు. అనంతరం ఆ శవాన్ని మరో స్మశానంలో పూడ్చిపెట్టారు.

Read also: శవానికి సైతం అంటరానితనం.. బ్రిడ్జి పై నుంచి దింపి అంత్యక్రియలకు..

వాస్తవానికి శవాన్ని పూడ్చిపెట్టిన మరుక్షణమే కుళ్లిపోవడం మొదలవుతుంది. ఈ ప్రక్రియను ఆటోలైసిస్ అంటారు. ఇలా ఐదు దశల్లో శవం కుళ్లిపోయి.. చివరికి ఎముకలు మాత్రమే మిగులుతాయి. కాలక్రమేనా అవి కూడా పూర్తిగా భూమిలో కలిసిపోతాయి. శరీర అవయవాలు పనిచేయడం మానేసిన తర్వాత లోపల ఉండే బ్యాక్టీరియా శరీరాన్ని కుళ్లిపోయేలా చేస్తాయి. అయితే, నాసిర్ విషయంలో మాత్రం అలా జరగకపోవడం నిజంగా చిత్రమే కదూ!!

Read also: గోవాలో ‘చికెన్’ దెయ్యం.. ఆ మార్గంలో వెళ్తే గుండె గుభేల్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.