వధువురులకు ఆశీర్వదించి.. విందు ఆరగించడానికి వెళ్లిన అతిథులకు ‘ఆధార్ కార్డులు’ పంచడం చర్చనీయమైంది. అదేంటీ.. ఆధార్ కార్డులు ప్రభుత్వం కదా జారీ చేయాలి. పెళ్లి విందులోనే ఎందుకు ఇచ్చారనేగా మీ సందేహం. అయితే, పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి తెలుసుకోవల్సిందే. రాజర్హాట్కు చెందిన గోగల్ సహా, సుబర్ణ దాస్లు పెళ్లి ఇటీవల ఇంటర్నెట్లో చర్చనీయంగా మారింది. ఇందుకు కారణం.. పెళ్లి విందులో ఆధార్ కార్డులను పంచడమే. అయితే, అవి ప్రభుత్వం జారీ చేస్తున్న ఆధార్ కార్డులని భావిస్తే తప్పులో కాలేసినట్లే. అవి పెళ్లి విందులో పెట్టే ఫుడ్ వెరైటీల మెనూ కార్డ్. కాస్త కొత్తగా.. క్రియేటివ్గా ఉంటుందనే ఉద్దేశంతో వారు ఆధార్ కార్డుల తరహాలో మెనూ కార్డును ముద్రించి అతిథులకు అందించారు.
అందులో ‘ఆధార్ కార్డు’ పేరు స్థానంలో ‘సుబర్ణ వెడ్స్ గొగల్’ పేర్లను ముద్రించారు. వంటకాలను ఫొటోగా పెట్టారు. ఆధార్ నెంబరు స్థానంలో వారి పెళ్లి తేదీ (ఫిబ్రవరి 2) ముద్రించారు. పేర్ల స్థానంలో పెళ్లి విందులో పెట్టే ఫుడ్ ఐటమ్స్ను పేర్కొన్నారు. చికెన్ లాలీపప్, క్రిస్పీ బేబీ కార్న్, కాఫీతోపాటు బెంగాలీ వంటకాలైన మటన్ కషా, రసగుల్లా, సందేష్ తదితర ఆహారాల వివరాలు ముద్రించారు. ఆ కార్డు వెనుక కేటరింగ్ సంస్థ పేరును ఇచ్చారు.
వధువు సుబర్ణ హెల్త్ కేర్ ప్రొఫెషనల్, గోగల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎంప్లాయ్. ఈ ‘ఆధార్’ మెనూ కార్డు గురించి గోగల్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘ఇది నా భార్య సుబర్నాకు వచ్చిన ఐడియా. డిజిటల్ ఇండియాకు మద్దతు తెలిపేందుకు ఇది మంచి మార్గమని ఆలోచించాం. ఈ కార్డులు చూసి అతిథులు కూడా ఆశ్చర్యపోయారు. కొంతమందైతే.. తమ ఆధార్ కార్డును మరిచిపోయామని భావించి వెనక్కి వచ్చి చూసుకొనేవారు’’ అని తెలిపాడు. ఈ మెనూ కార్డుకు సంబంధించిన చిత్రాలు ఫేస్బుక్లో వైరల్గా మారాయి.
వధువు సుబర్ణ హెల్త్ కేర్ ప్రొఫెషనల్, గోగల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎంప్లాయ్. ఈ ‘ఆధార్’ మెనూ కార్డు గురించి గోగల్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘ఇది నా భార్య సుబర్నాకు వచ్చిన ఐడియా. డిజిటల్ ఇండియాకు మద్దతు తెలిపేందుకు ఇది మంచి మార్గమని ఆలోచించాం. ఈ కార్డులు చూసి అతిథులు కూడా ఆశ్చర్యపోయారు. కొంతమందైతే.. తమ ఆధార్ కార్డును మరిచిపోయామని భావించి వెనక్కి వచ్చి చూసుకొనేవారు’’ అని తెలిపాడు. ఈ మెనూ కార్డుకు సంబంధించిన చిత్రాలు ఫేస్బుక్లో వైరల్గా మారాయి.