యాప్నగరం

వామ్మో.. ఒకే కాన్పులో 9 మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళ.. వైద్యులు షాక్!

ఓ మహిళ ఒకేసారి 9 మంది పిల్లలకు జన్మనిచ్చింది. వైద్యులు తొలుత ఆమె కడుపులో ఏడుగురు పిల్లలే ఉన్నారని అనుకున్నారు. కానీ, ప్రసవం సమయానికి ఆమె అదనంగా మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.

Samayam Telugu 7 May 2021, 5:48 pm
కే కాన్పులో కవల పిల్లలు పుట్టడం గురించి మనకు తెలిసిందే. కొంతమంది మూడు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనడం గురించి కూడా మీరు వినే ఉంటారు. అయితే, మాలికి చెందిన ఓ మహిళకు ఒకే కాన్పులో ఏకంగా తొమ్మిది మంది పిల్లలు పుట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆమె గర్భం నుంచి ఒకరి తర్వాత మరొక బిడ్డ వస్తూ ఉంటే వైద్యులు షాకయ్యారు. వాస్తవానికి వైద్యులు ఆమె కడుపులో ఏడుగురు పిల్లలు ఉండవచ్చని అల్ట్రాసౌండ్ ద్వారా తెలుసుకున్నారు. కానీ, వారు ఊహించిన సంఖ్య ఇద్దరు అదనంగా పుట్టారు.
Samayam Telugu Representational Image


అంత మంది పిల్లలను ఆ మహిళ పేరు హలిమా సిస్సే. ఆమె కడుపులో ఏడుగురు పిల్లలు పెరుగుతన్నారనే విషయం తెలియగానే వైద్యులు ఆమెకు స్పెషల్ కేర్ అవసరమని తెలిపారు. ఈ అరుదైన కేసు గురించి ప్రభుత్వ అధికారులకు కూడా సమాచారం అందించారు. దీంతో ప్రభుత్వమే స్వయంగా ఆమెను మొరాకోకు తరలించాలని ఆదేశించింది. ఆమె బాగోగులు చూసేందుకు ప్రత్యేకంగా ఒక డాక్టర్‌ను కూడా నియమించింది.
అందమైన దీవిలో అదిరిపోయే ఉద్యోగం.. రూ.88 లక్షలు జీతం, కానీ..
సిస్సేకు సాధారణ ప్రసవం కష్టంగా మారడంతో సిజేరియన్ ద్వారా పిల్లలను బయటకు తీశారు. తొలుత ఆమె కడుపులో ఏడుగురు పిల్లలే ఉన్నారని వైద్యులు భావించారు. కానీ, ఆమె కడుపులో అదనంగా మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తమ అంచనాలు తప్పడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం తల్లి, పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. వారిని ఇంటికి తరలించడానికి మరికొన్ని వారాల సమయం పట్టవచ్చని పేర్కొన్నారు. ఆమె మొత్తం ఐదుగురు ఆడపిల్లలు, నలుగురు మగ పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలిపారు.

Watch Also:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.