యాప్నగరం

తండ్రిని టీవీ రిమోట్‌తో చంపేసిన కూతురు, ఇదో అరుదైన కేసు!

Murder with Tv remote | ఆ మహిళ కోపం తన తండ్రి చావుకు కారణమైంది. ఆ క్షణంలో ఆమె విసిరిన రిమోట్ ఆయుధమైంది. చివరికి తండ్రి ప్రాణాలు బలిగొంది.

Samayam Telugu 29 Aug 2019, 8:06 pm
వరైనా కత్తులతో పొడిచి చంపుతారు, లేదా బలమైన వస్తువుతో కొట్టి చంపుతారు. కానీ, ఆమె తేలికపాటి రిమోట్‌తో నిండు ప్రాణాలను బలిగొంది. చిత్రం ఏమింటంటే.. ఈ కేసును సీరియస్‌గా తీసుకోవలసిన పోలీసులు విచిత్రంగా పరిగణించారు. ఆ దేశంలో రిమోట్‌తో హత్య చేసిన తొలి మహిళగా నిందితురాలికి గుర్తింపు ఇచ్చారు.
Samayam Telugu 58256704


యూకేలోని బ్రిస్టోల్‌కు చెందిన నికోలా టౌన్‌సెండ్ (50) తన తండ్రి టెరెన్సే(78)తో కలిసి జీవిస్తోంది. తండ్రితో వాగ్వాదానికి దిగిన నికోలా ఆగ్రహంతో తండ్రి మీదకు రిమోట్ విసిరింది. ఆ నొప్పితో కిచెన్‌లోకి వెళ్లి కిందపడ్డాడు. దీంతో పక్కటెములు విరిగిపోయాయి. దానివల్ల శ్వాసనాళసంబంధ నిమోనియా(Bronchopneumonia)తో చనిపోయాడు. ఆ రిమోట్ తలకు తగలడం వల్ల అతడికి తీవ్ర గాయమైనట్లు గుర్తించారు. ప్రస్తుతం నికోలా బెయిల్‌ మీద బయటకు వచ్చింది. ఈ ఘటనపై కోర్టు త్వరలోనే తీర్పు వెల్లడించనుంది. అయితే, ఈ కేసును కోర్టు ప్రత్యేకంగా భావిస్తోంది. బ్రిటన్ చరిత్రలో రిమోట్‌ను ఆయుధంగా ఉపయోగించిన తొలి మహిళగా నికోలాను గుర్తించింది.

Read Also: లిఫ్ట్ ఇస్తాడు, హత్యచేసి శవాలను రేప్ చేసి.. తినేస్తాడు, తల్లినీ వదలని రాక్షసుడు!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.