నీళ్లు తాగడం ఆరోగ్యకరం అంటారు. ఈమె మాత్రం నీళ్లు తాగకపోతేనే ఆరోగ్యంగా ఉంటారని అంటోంది. అదెలాగో తెలుసుకోవాలని ఉందా? అయితే, ఆమె పాటిస్తున్న ఈ సరికొత్త డైట్ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే.
Samayam Telugu10 Feb 2020, 4:40 pm
నిత్యం నీళ్లు తాగితే వ్యాధులే దరిచేరవని, చర్మం కూడా మెరుస్తుందని చెబుతుంటారు. ముఖ్యంగా శరీరం డీహైడ్రేషన్కు గురికాకుండా ఉండాలంటే తప్పకుండా నీళ్లు తాగాల్సిందేనని అంటారు. మనం కూడా ఒక్క రోజు నీళ్లు తాగకపోతే గొంతు ఎండిపోయి దాహంతో విలవిల్లాడతాం. ఆహారం తిన్నా, తినకపోయినా గుక్కెడు నీళ్లు నోటిలో పడితే ప్రాణం లేచివస్తుంది. కానీ, ఈమె చుక్క నీరు తాగకుండా జీవించేస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఏడాది నుంచి నీటికి దూరంగా ఉంది.
ఎందుకు మానేసింది?
బాలిలో నివసిస్తున్న సోఫియే పార్థిక్ అనే 35 ఏళ్ల మహిళ యోగా శిక్షకురాలిగా పనిచేస్తోంది. ఏడాది కిందట ఈమె అనేక అనారోగ్య సమస్యలతో బాధపడింది. కీళ్ల నొప్పులు, కళ్ల ఉబ్బరం, ఫుడ్ అలర్జీ, జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడింది. దీంతో ఆమె కీలకమైన నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్లు నీళ్లు తాగకుండా జీవించాలని నిర్ణయించుకుంది. ‘నో వాటర్ డైట్’ చేయడం ఆరంభించింది.
నీళ్లు లేకుండా ఎలా?
పోషకాలు కావాలంటే కేవలం నీళ్లు మాత్రమే తాగాల్సిన అవసరం లేదని, ఆహరంలో ఉండే నీటి శాతం శరీరానికి సరిపోతుందని సోఫియా చెబుతోంది. పండ్లు, కూరగాయలతో తన శరీరానికి కావాల్సినన్ని పోషకాలు లభిస్తున్నాయని తెలిపింది. ఈ డైట్ పాటించిన తర్వాత గతంలో ఎదురైన అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయాయని పేర్కొంది.
సర్జరీ చేయాలన్నారు..
‘‘ఉబ్బిన కళ్లకు చికిత్స చేయించుకోడానికి హాస్పిటల్కు వెళ్తే.. డాక్టర్లు సర్జరీ చేయాలన్నారు. దీంతో ఎంతో ఆందోళనకు గురయ్యా. నా సమస్య తెలుసుకున్న ఫ్రెండ్ డ్రై ఫాస్టింగ్ చేయాలని చెప్పింది. నీటిని తాగకుండా కేవలం పండ్లు, కూరగాయలను మాత్రమే ఆహారంగా తీసుకోవాలని సూచించింది. అప్పటి నుంచి నేను ఈ డైట్ పాటిస్తున్నా’’ అని సోఫియా తెలిపింది.
నీళ్లు తాగితే ఏమవుతుంది?
‘‘బాటిల్ లేదా ట్యాప్ వాటర్ను తాగినట్లయితే కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. నీళ్ల వల్ల కిడ్నీలు అతిగా పనిచేయాల్సి వస్తుంది. శరీరాన్ని హైడ్రేషన్ చేయడానికి బదులు శరీరాన్ని ఉబ్బేలా చేస్తుంది. ఆరోగ్యంగా ఉండటానికి నీళ్లే తాగాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు డ్రై డైటింగ్ చేస్తే తప్పకుండా ఆ తేడా తెలుస్తుంది. అంతగా దాహం వేస్తే కొబ్బరి నీళ్లు, నీళ్లు కలపకుండా చేసే పండ్ల జ్యూస్లను తాగవచ్చు’’ అని తెలిపింది.
రోజూ 14 గంటలు..
రోజూ 14 గంటలు పాటు ఆమె నీరుగానీ, నీటిని కలిగిన ఆహారాన్ని గానీ ముట్టుకోదు. ఆ తర్వాత నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయాలను మాత్రమే ఆరగిస్తుంది. ఏడాదిలో డైటింగులో ఆమె 52 గంటలు నిర్విరామంగా నీరు కలిగిన ఏ ఆహారాన్ని ముట్టకపోవడం గమనార్హం. భవిష్యత్తులో తాను సుమారు 10 రోజులు ఈ డ్రై డైట్ను పాటించాలనే లక్ష్యం పెట్టుకున్నానని సోఫియా తెలిపింది.
డ్రై డైటింగ్ అనేది అందరికీ సాధ్యం కాదని సోఫియా తెలిపింది. తనలా ‘నో వాటర్ డైట్’ చేయాలని తాను ఎవరికీ సూచించని పేర్కొంది. డ్రై డైట్ చేయాలని ఉంటే కొద్ది నెలలపాటు పండ్లు, కూరగాయాలను మాత్రమే తినాలని తెలిపింది. తాను ఈ డైట్ పాటిస్తున్నా ఆరోగ్యంగా ఉండేందుకు యోగా కూడా తోడ్పడిందని సోఫియా వెల్లడించింది. చూశారుగా.. ఆమె హెల్త్ సీక్రెట్. అయితే, వైద్యుల సూచనలు లేకుండా మీరెప్పుడు ఇలాంటి డైటు పాటించే ప్రయత్నం చేయకండి.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.