యాప్నగరం

తన ప్రాణాలను ఫణంగా పెట్టి.. వరద నీటిలో అంబులెన్సుకు దారి చూపిన బాలుడు

Karnataka floods | ఓ బాలుడు తన ప్రాణాలను ఫణంగా పెట్టి వరద నీటిలో చిక్కుకున్న అంబులెన్సుకు దారి చూపాడు.

Samayam Telugu 14 Aug 2019, 8:39 pm
భారీ వరదలు కర్ణాటకను అతలాకుతలం చేస్తున్నాయి. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. దీంతో బాధితులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వలసపోతున్నారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉదృతి ఎక్కువగా ఉండటంతో సహాయ చర్యలకు విఘాతం ఏర్పడుతోంది.
Samayam Telugu flood_1565767764_800x420


రాయచూర్ జిల్లాలో దేవదుర్గ తాలుక.. హిరెరయనకుంపీ గ్రామం నుంచి ఆరుగురు పిల్లలు, ఓ మహిళ శవంతో బయల్దేరిన మంచనూర్‌ గ్రామానికి బయల్దేరిన ఓ అంబులెన్సు వరద నీటిలో చిక్కుకుంది. అదే సమయంలో వరద ఉదృతి మరింత పెరిగింది. దీంతో ఆ అంబులెన్సులో ఉన్న 12 ఏళ్ల బాలుడు డ్రైవర్‌కు మార్గం చూపేందుకు సిద్ధమయ్యాడు. వరద నీటిలో దిగి రోడ్డు మీద నడుస్తూ డ్రైవర్‌కు దారి చూపించాడు. ఎట్టకేలకు అంబులెన్సును సురక్షితంగా వంతెన దాటించాడు. దీంతో ప్రజలు ఆ బాలుడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
వీడియో:
Read also: తృటిలో చావు తప్పింది.. కానీ అతడి తల్లి చిక్కుకుంది, కొండచరియల బీభత్సం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.