యాప్నగరం

అయోధ్య తీర్పు కోసం 27 ఏళ్లుగా అన్నం ముట్టని 81 ఏళ్ల బామ్మ!

అయోధ్యపై తీర్పు కోసం గత 27 ఏళ్ల నుంచి ఆమె ఉపవాస దీక్షలో ఉన్నారు. ఎట్టకేలకు సానుకూల తీర్పు వెల్లడి కావడంతో ఆమె రామ మందిర నిర్మాణంలో పాలు పంచుకుంటానని తెలుపుతున్నారు.

Samayam Telugu 12 Nov 2019, 1:45 pm
యోధ్యపై సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుతో 27 ఏళ్ల వివాదానికి పూర్తిగా తెరపడింది. రామమందిరం నిర్మాణానికి అడ్డంకులు కూడా తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన 81 ఏళ్ల బామ్మ ఊర్మిళా చతుర్వేది సంతోషానికి అవధుల్లేవు. ఈ రోజు కోసం గత 27 ఏళ్లుగా అన్నం ముట్టకుండా కేవలం పాలు, పండ్లు మాత్రమే తీసుకుంటున్న ఆమె.. కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసింది.
Samayam Telugu Photo credit: Twitter
Photo credit: Twitter


Also Read: పెళ్లిలో వరుడు నాగినీ డ్యాన్స్.. ఊహించని షాకిచ్చిన వధువు!

ఈ సందర్భంగా ఊర్మిళ కుమారుడు మాట్లాడుతూ.. ‘‘మా అమ్మ రామ భక్తురాలు. అయోధ్య తీర్పు కోసం54 ఏళ్ల వయస్సులో అన్నం తినడం పూర్తిగా మానేసింది. కేవలం పాలు, పండ్లు మాత్రమే తీసుకుంటూ తీర్పు కోసం ఎదురుచూస్తోంది. సానుకూల తీర్పు వెల్లడైందని తెలియగానే ఆమె ఎంతో సంతోషించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాయాలని కోరింది’’ అని తెలిపాడు. త్వరలో జరగబోయే రామ మందిరం నిర్మాణంలో కూడా ఆమె పాలు పంచుకుంటానని తెలుపుతోంది. అయితే, 27 ఏళ్లుగా పాలు, పండ్లకే అలవాటు పడిన నేపథ్యంలో.. వైద్యులను సంప్రదించి ఆమెకు ఆహారం పెడతామని కుటుంబ సభ్యులు తెలిపారు.

Also Read: స్కూల్‌లో ఖాళీ గిన్నెతో చిన్నారి ‘ఆకలి చూపులు’.. చివరికి, అదే స్కూల్‌లో అడ్మిషన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.