యాప్నగరం

Sri Reddy: ‘పుల్కాకు మళ్లీ గుండు.. ఇంకో పెళ్లి చేసుకుంటాడేమో’

‘‘పీకేకి భార్యలు నలుగురు, మొగుళ్లు ఇద్దరు’’ అంటు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి. నాగబాబుపైనా సెటైర్లు. మండిపడుతున్న మెగా ఫ్యాన్స్.

Samayam Telugu 24 May 2019, 10:49 pm
నసేన అధినేత పవన్ కళ్యాణ్‌, ఆయన సోదరుడు నాగబాబుపై శ్రీరెడ్డి వరుస కామెంట్లతో సోషల్ మీడియాలో కాక రేపుతోంది. ‘పుల్కా కళ్యాణ్, స్నేక్ బాబు’ అంటూ ఆమె పరోక్షంగా వారిద్దరిపై విమర్శలు గుప్పిస్తూ.. మెగా అభిమానుల సహనానికి పరీక్షస్తోంది. తాజాగా పవన్ ఓటమిపై కూడా ఆమె వివాదాస్పద వ్యాఖ్యలతో మరింత హీట్ పెంచేసింది.
Samayam Telugu 56815972_2353351028245149_6059427482824605696xxx_n


‘‘షూటింగులు పాయే.. పాలిటిక్స్ పాయే.. ఏం చేయాలో తెలియక ఇంకో పెళ్లి చేసుకుంటాడేమో’’ అంటూ పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. అనంతరం ‘‘పీకేకి భార్యలు నలుగురు, మొగుళ్లు ఇద్దరు. తెలంగాణకు వస్తే కేసీఆర్, ఆంధ్రాకు వస్తే జగన్’’ అని పేర్కొంది. ‘‘జగన్ పేరు ఎత్తగలరా ఇప్పుడు స్నేక్ బాబు, పుల్కా కళ్యాణ్.. మళ్లీ కొట్టేస్తాం గుండు. స్నేక్ బాబుకు ఆల్రెడీ ఎవరో కొట్టేశారు గుండు’’ అని కామెంట్స్ చేసింది.
ఫలితాల్లో వైసీపీ గెలిచిందని తెలిసిన సమయం నుంచి శ్రీరెడ్డి మెగా సోదరులపై కామెంట్ల వర్షం కురిపిస్తోంది. నాగబాబు ఓటమి చవిచూశాడని తెలియగానే ఆయన్ని టార్గెట్ చేసుకుంది. ‘‘మూలశంఖోడు ఎంపీ అయిపోదామనుకున్నాడు కదా.. స్నేక్ బాబు ఎక్కడ?? జబర్దస్త్ రీ ఎంట్రీ కోసం అన్నపూర్ణ స్టుడియో గేట్ దగ్గర వెయిటింగ్ అంటగా..’’ అంటూ వివాదాస్పద కామెంట్లను పోస్ట్ చేసింది. దీంతో మెగా అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.