యాప్నగరం

పైలట్ల మధ్య గొడవ.. డ్రైనేజీలోకి దూసుకెళ్లిన ఎయిర్ ఇండియా విమానం

30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ.. కో-పైలట్ మాట వినకుండా విమానాన్ని నడిపిన సీనియర్ పైలట్. డ్రైనేజీలోకి దూసుకెళ్లిన విమానం.

Samayam Telugu 11 May 2019, 2:00 pm
న కంటే తక్కువ వయస్సు ఉన్న మహిళా కో-పైలట్ సూచనలు వినడానికి ఇష్టపడని ఓ సీనియర్ పైలట్ చేసిన ఘనకార్యం ఇది. ఆమె హెచ్చరికలను పట్టించుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించిన ఆ పైలట్ విమానాన్ని నేరుగా డ్రైనేజీలోకి దింపాడు. 2017లో చోటుచేసుకున్న ఈ ఘటన వెనుక వాస్తవాలు రెండేళ్ల తర్వాత బయటపడ్డాయి.
Samayam Telugu తవ


102 మంది ప్రయాణికులతో అబుదాబి నుంచి కోచికి బయల్దేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ IX 452 విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. భారీ వర్షం వల్ల పైలట్లకు రన్‌వే కనిపించలేదు. దీంతో విమానం రన్‌వే మీద నుంచి రైన్ వాటర్ డ్రైనేజీలోకి జారుకుంది. ఫలితంగా విమాన చక్రాలు డ్రైనేజీలో ఇరుక్కున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు.
ఈ ఘటనపై విచారణ జరిపిన డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA).. విమానం కమాండింగ్ బాధ్యతల్లో ఉన్న సీనియర్ పైలట్‌దే తప్పని తేల్చింది. తన కంటే 30 ఏళ్ల వయస్సు తక్కువున్న కో-పైలట్ హెచ్చరికలను పట్టించుకోకుండా విమానాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది.

భారీ వర్షం వల్ల విమానం రన్‌వే మార్క్స్ కనిపించడం లేదని, విమానాన్ని కాస్త నెమ్మదిగా నడపాలని కో-పైలట్.. సీనియర్ పైలట్‌ను కోరింది. అయితే, ఆమె మాటలు వినకుండా మొండిగా విమానాన్ని నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ నేపథ్యంలో డీజీసీఏ.. పైలట్‌ లైసెన్సును మూడు నెలలపాటు రద్దు చేసింది. ఈ ఘటన ఆధారంగా ఇకపై విమానంలోని పైలట్ల మధ్య వయస్సు వ్యత్యాసం ఎక్కువ లేకుండా జాగ్రత్తపడాలని డీజీసీఏ విమానయాన సంస్థలకు సూచించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.