యాప్నగరం

viral video: ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్.. ఫ్రీగా రెండు వారాలు బాలి ట్రిప్

2 వారాలు పెయిడ్ హాలిడే ఇస్తే... ఏ కంపెనీ ఉద్యోగులైనా ఎగిరి గంతేస్తారు. ఆ ఆస్ట్రేలియా కంపెనీ ఈ బంపర్ ఆఫర్ ఇవ్వడమే కాదు... బాలిలో వారికి అయ్యే ఖర్చులన్నీ తానే భరించింది. ఈ ఆఫర్ అందుకున్న ఉద్యోగులు రెక్కలు కట్టుకొని బాలిలో వాలిపోయారు. వారికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు వారి ఎంజాయ్ చూసి.. అదుర్స్ అంటున్నారు. ఇంతకీ ఆ కంపెనీ ఎందుకు ఈ ఆఫర్ ఇచ్చింది? దీని వల్ల ఏంటి ప్రయోజనం? సంస్థ ఎండీ దీనిపై ఏమంటున్నారు?

Authored byKrishna Kumar | Samayam Telugu 6 Jul 2022, 11:31 am
ఆస్ట్రేలియా... సిడ్నీకి చెందిన ఓ కంపెనీ బాస్‌ని అందరూ ప్రపంచంలో బెస్ట్ బాస్ అంటున్నారు. కారణం ఆమె ఉద్యోగులందర్నీ ఇండొనేసియాలోని ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం బాలి (Bali)కి తీసుకెళ్లింది. 2 వారాలపాటూ ఈ ట్రిప్ ప్రకటించింది. ఇందుకు అయ్యే ఖర్చులన్నీ తానే భరించింది. ఈ రెండు వారాలూ శాలరీ కూడా ఇస్తానని తెలిపింది. ఇలా పెయిడ్ హాలిడేస్ ఇచ్చి... అన్ని ఖర్చులూ భరించే బంపర్ ఆఫర్ ఇవ్వడంతో... ఉద్యోగుల ఆనందానికి ఆకాశమే హద్దు అయ్యింది. సిడ్నీలో మార్కెటింగ్ సంస్థ సూప్ ఏజెన్సీలో ఉద్యోగులు ఈ ఆఫర్ పొందారు. (Australian company paid holiday)
Samayam Telugu ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్ (image credit - instagram - soup_agency)
ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్ (image credit - instagram - soup_agency)


బాలికి ఉద్యోగులు ఎలా వెళ్లారు, అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనే దృశ్యాలకు సంబంధించిన వీడియోని ఈ కంపెనీ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ soup_agencyలో పోస్ట్ చేసింది. "బాలిలో వ్రాపప్. టీమ్ అందరికీ మొదటి వర్కింగ్ హాలిడే" అని క్యాప్షన్ ఇచ్చింది. అందులో ఉద్యోగులు ఓ ఉదయం వేళ ఎండ సమయంలో బాలికి ఎంటరయ్యారు. ఆ తర్వాత అక్కడి విల్లాలో రెస్ట్ తీసుకుంటున్నారు. స్విమ్మింగ్ పూల్స్‌లో ఈత కొడుతూ, యోగా చేస్తూ, తింటూ, తాగుతూ ఇలా అందరూ కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. (Employees trip to Bali)

ఆ వీడియోని ఇక్కడ చూడండి (viral video)
View this post on Instagram A post shared by Soup Agency (@soup_agency)


ఎందుకిలా?
సూప్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ కత్య వకులెంకో... దీనిపై స్పందించారు. ఏజెన్సీని ప్రారంభించాక... ఉద్యోగుల మధ్య బలమైన బంధాన్ని ఏర్పరిచేందుకు చేసిన మొదటి ట్రిప్ ఇది అని ఆమె తెలిపారు. "నా ఉద్దేశంలో పనిచేసే చోట ఉద్యోగులంతా ఓ టీమ్‌లా కలిసి ఉండాలి. పనివేళల్లోనే కాదు.. పని తర్వాత కూడా వాళ్లలో టీమ్ బిల్డప్ ఉండాలి" అని ఆమె అభిప్రాయపడ్డారు.
viral video: కొంపముంచిన అతివేగం.. లవర్స్‌కి ఊహించని ట్విస్ట్
"కరోనా వచ్చాక.. మనం వేర్వేరు ప్రాంతాల్లో పనిచేయాల్సి వచ్చింది. మనం ఎక్కడినుంచైనా పనిచెయ్యగలం అని గ్రహించాం. ఈ అంశాన్ని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లాలని ఇలా చేశాం" అని కత్య తెలిపారు.
View this post on Instagram A post shared by Soup Agency (@soup_agency)

ఈ ట్రిప్ ద్వారా వేర్వేరు డిపార్ట్‌మెంట్లకు చెందిన ఉద్యోగులంతా ఒక్కటయ్యారు. ఉబద్ లోని లగ్జరీ విల్లాలో వారు స్టే చేశారు. ఇది దెంపసార్‌కి ఉత్తరాన గంట ప్రయాణ దూరంలో ఉంది. ఈ ట్రిప్‌లో ఉద్యోగి మిషెల్లే... తన 24వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఆ సందర్భంగా అక్కడి ఓ అగ్నిపర్వతంపైకి ఎక్కారు.
NASA Satellite: తప్పిన శాస్త్రవేత్తల అంచనా.. చందమామకు ముప్పు రాబోతోందా?
మొత్తంగా ఈ ట్రిప్ వల్ల మేలు జరిగిందని సంస్థ భావిస్తోంది. "అందరూ కలవడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, సహకరించుకోవడం, సరికొత్తగా ఉండటం.. ఇవన్నీ జీవితంలో మేలు చేసే అనుభవాలు. మనం వాటిని ఎప్పటికీ మర్చిపోలేం" అని డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కుమీ హో తెలిపారు. సినిమాలకు సీక్వెల్‌లా.. ఈ కంపెనీ నెక్ట్స్ ట్రిప్‌గా యూరప్‌ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.