యాప్నగరం

మహిళ ప్రాణం తీసిన తలనొప్పి మాత్రలు

తలనొప్పి వస్తుంటే మాత్రలు వేసుకుంటున్నారా? అవి ప్రాణాలు తీసే ప్రమాదం ఉంది.

Samayam Telugu 11 Sep 2019, 7:06 pm
లనొప్పిగా ఉందని పదే పదే మాత్రలు మింగుతున్నారా? జాగ్రత్త! బెంగళూరుకు చెందిన ఓ మహిళ తలనొప్పి మాత్రలు మింగి ప్రాణాలు కోల్పోయింది. అనసూయమ్మ అనే మహిళ గత 15 ఏళ్లుగా తలనొప్పితో బాధపడుతోంది. దీంతో ఆమె నిత్యం మాత్రం వేసుకోవడం అలవాటు చేసుకుంది. ఇటీవల ఆమెకు తీవ్రమైన తలనొప్పి రావడంతో 15 మాత్రలు మింగింది.
Samayam Telugu headache_1568201549_725x725


మాత్రలు మింగిన కొద్ది సేపటి తర్వాత ఆమె కోమాలోకి జారుకుంది. దీంతో ఆమె కుమార్తె శోభా విక్టోరియా హాస్పిటల్‌లో చేర్చింది. అయితే, ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. భర్త మునేషప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు.

Read also: నవ్వు తెచ్చిన తంటా.. తెరిచిన నోరు మూయలేక మహిళ పాట్లు

అతిగా మాత్రలు మింగడం చాలా ప్రమాదకరమని, ఒకేసారి ఎక్కువ మాత్రలు వేసుకున్నట్లే సమస్య తగ్గకపోగా ఎక్కువ అవుతుందని వైద్యులు ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యం వైద్యులను సంప్రదించకుండా ఎలాంటి శరీరక సమస్యకు సొంతం వైద్యం చేసుకోరాదని హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.