యాప్నగరం

River Umngot: ఈ నదిలో రూపాయి వేస్తే ఏమవుతుందో తెలుసా?

River Umngot: ఈ నది మన దేశంలోనే ఉంది. ఇది మిగతా నదులకు భిన్నంగా ఉంది. మరి అందులో రూపాయి లేదా ఏదైనా నాణెం వేస్తే ఏమవుతుందో తెలుసుకుందాం.

Samayam Telugu 18 Nov 2021, 10:23 am
River Umngot: నవంబర్ 16 ఉదయం 8.24 నుంచి సోషల్ మీడియాలో ఓ ఫొటో తెగ చక్కర్లు కొడుతోంది. అది భారతీయులకు ఒకింత ఆనందం కలిగిస్తోంది. నిజానికి అదో ట్వీట్. దాన్ని కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ... తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. జనరల్‌గా కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి ఏ ట్వీట్ వచ్చినా అది వైరల్ అవ్వడం సహజం. కానీ అవి సీరియస్‌గా ఉంటాయి. ఇది అలా కాదు. ఇది అందరిలోనూ ఆనందంతోపాటూ... ఒకింత గర్వపడేలా చేస్తోంది. విషయమేంటంటే... ఓ నదిలోని పడవలో ఐదుగురు ప్రయాణిస్తున్న ఫొటో ఇది. ఆ నది పేరు ఉంగాట్ (River Umngot). మన దేశంలోని మేఘాలయ రాష్ట్రంలోని... షిల్లాంగ్‌కి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే... ఇది ప్రపంచంలోని అత్యంత శుద్ధమైన నదుల్లో ఒకటి (one of the cleanest rivers in the world) అని ట్వీట్ ద్వారా తెలిపారు.
Samayam Telugu పరిశుద్ధమైన నది (image credit - twitter - @MoJSDoWRRDGR)


ఈ ఫొటోని చూస్తే... ట్వీట్‌లో చెప్పింది నిజమే అని అనిపించకమానదు. ఎందుకంటే నదిలోపలి రాళ్లు, మట్టి, నాచు అన్నీ కనిపిస్తున్నాయి. అంతేకాదు.. ఇందులో మనం ఏ రూపాయి నాణెమో వేశామంటే... అది కచ్చితంగా మనకు కనిపిస్తుంది అనుకోవచ్చు (నాణేలు వెయ్యమని కోరట్లేదని గ్రహించగలరు). అంత క్లీన్‌గా ఉన్నట్లు ఈ ఫొటో ద్వారా అర్థమవుతోంది. అందుకే ఈ ట్వీట్ వైరల్ అయ్యి... సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కనిపిస్తోంది (viral tweet).

ఆ ట్వీట్‌ని ఇక్కడ చూడండి

ఈ నది ఇంత పారదర్శకంగా ఉండటంలో ఆశ్చర్యం అక్కర్లేదు. ఎందుకంటే... మేఘాలయలో జనాభా సంఖ్య తక్కువ. అక్కడ కాలుష్యమూ తక్కువే. దానికి తోడు అక్కడి స్థానికులు ఈ నదికి ఎలాంటి కాలుష్యమూ అవ్వకుండా కాపాడుతున్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. అందుకే ఇది ఇంత క్లీన్‌గా ఉంది. దీన్ని మేఘాలయ సహజ అందంగా అభివర్ణిస్తారు ప్రకృతి ప్రేమికులు.

ఈ ట్వీట్‌కి నెటిజన్లు ఆనందంగా స్పందిస్తున్నారు. చాలా మంది మేఘాలయ ప్రజలను మెచ్చుకుంటున్నారు. రెండ్రోజుల్లో ఈ ట్వీట్‌ని 22 వేల మందికి పైగా లైక్ చేశారు. 4వేల మందికి పైగా రీట్వీట్ చేశారు.

ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కి నెటిజన్ల సలామ్.. ఫండ్ ఇస్తానని హామీ!
ఇదే విధంగా మన గంగ, యమున నదులు (river pollution) ఉంటే... అప్పుడు మనం మరింత గొప్పగా, గర్వంగా ఫీల్ అవ్వొచ్చు. మన నాన్నమ్మలు, తాతలు... వాళ్ల కాలంలో... చెరువుల్లో నీటిని తాగేవారు. మన జనరేషన్‌కి వచ్చేసరికి.. ఏ నీరూ తాగే పరిస్థితి లేదు. అంతటా కాలుష్యమే. చివరకు వాటర్ బాటిళ్లలో నీరు కొనుక్కునే దుస్థితి ఉంది. అంతలా కాలుష్యం కమ్మేసింది. దీనిపై మనం ఎంతో విచారించాల్సిన అవసరం కూడా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.