యాప్నగరం

4 Lane Coastal Highway: 4 లేన్ తీర ప్రాంత హైవే.. ఫొటోలు షేర్ చేసిన నితిన్ గడ్కరీ

4 Lane Coastal Highway: నితిన్ గడ్కరీ కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖా మంత్రిగా మారిన తర్వాత.. దేశంలోని రోడ్లపై పూర్తిగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. హైవేలపై ఫ్లైఓవర్లతోపాటూ... రోడ్ల విస్తరణపై కూడా కేంద్రం దృష్టి సారిస్తోంది. తాజాగా ఆయన షేర్ చేసిన 4 లేన్ల తీర ప్రాంత హైవే ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. వాటిపై నెటిజన్లు తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. ఇందకు మంత్రి ఏమన్నారు? ఆ రోడ్లకు సంబంధించి ఆయన ఏం చెప్పారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Authored byKrishna Kumar | Samayam Telugu 5 Jul 2022, 9:54 am
ఒక్కసారి ఊహించుకోండి... బీచ్ పక్క నుంచి రోడ్డుపై వెళ్తుంటే.. ఎలా ఉంటుంది. అలల సవ్వళ్లు, చల్లటి గాలులు, విశాలమైన సముద్రం, తెల్లటి ఇసుక ఇవన్నీ మనసుకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తాయి. ఆ జర్నీ ఎంతో తృప్తిగా ఉంటుంది. ఇలాంటి ఫీల్ కలిగించే గోవా-కర్ణాటకకి సంబంధించిన 4 లేన్ల తీర ప్రాంత హైవే దాదాపు పూర్తి కావస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) తన ట్విట్టర్ అకౌంట్ @nitin_gadkariలో జులై 2, 2022న షేర్ చేశారు. ఇది మొత్తం 187 కిలోమీటర్ల రోడ్డు. ఇది నేషనల్ హైవే 17కి సంబంధించిన కుందాపూర్ ని, గోవా-కర్ణాటక సరిహద్దుతో కలుపుతుంది. అరేబియా సముద్ర తీరం గుండా ఈ హైవే సాగుతుంది. పశ్చిమాన పశ్చిమ కనుమలవైపుగా వెళ్తుంది (4 Lane Coastal Highway). "చూడటానికి అద్భుతమైన దృశ్యం. ఈ ప్రాజెక్టు అతి ముఖ్యమైన తీరప్రాంత హైవే లింక్. ఇది పశ్చిమ, దక్షిణ ఇండియాని కలుపుతుంది" అని నితిన్ గడ్కరీ ట్వీట్‌కి క్యాప్షన్ ఇచ్చారు. (highway of india)
Samayam Telugu 4 లేన్ తీర ప్రాంత హైవే (image credit - twitter - @nitin_gadkari)
4 లేన్ తీర ప్రాంత హైవే (image credit - twitter - @nitin_gadkari)


ఈ ప్రాజెక్టు ఎంత ముఖ్యమైనదో వివరిస్తూ గడ్కరీ కొన్ని ట్వీట్లు చేశారు. "ఈ వ్యూహాత్మక హైవే ప్రత్యేక టెర్రైన్ల గుండా సాగుతుంది. దాదాపు 50 శాతం రోలింగ్ టెర్రైన్ల (45 కి.మీ) మీదుగా వెళ్తుంది. అలాగే 24 కిలోమీటర్లు పర్వత టెర్రైన్ల గుండా వెళ్తుంది" అని తెలిపారు.

"ప్రస్తుతం 173 కిలోమీటర్ల హైవే పూర్తైంది. అంటే 92.42 శాతం పని పూర్తైంది. ఇప్పటికే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. మిగతా ప్రాజెక్టు 2022 డిసెంబర్ నాటికి పూర్తవుతుంది" అని గడ్కరీ మరో ట్వీట్‌లో వివరించారు.

ఈ హైవే ద్వారా రాష్ట్రాల మధ్య వాహనదారులు ప్రయాణించేందుకు వీలవుతుంది. అలాగే ఈ మార్గంలో పాన్వెల్, చిప్లూన్, రత్నగిరి, పనాజీ, మార్గావ్, కార్వార్, ఉడుపి, సూరత్‌కాల్, మంగళూరు, కోజికోడ్, కోచి, తిరువనంతపురం, కన్యాకుమారి వంటి వాణిజ్య కేంద్రాలున్నాయి.
viral video: వరదలో ప్రాణాలకు తెగించి పిల్లల్ని కాపాడాడు.. అతనెవరో తెలుసా?
ఈ తీర ప్రాంత హైవే వల్ల ప్రయాణికుల టైమ్ సేవ్ అవుతుందనీ అలాగే.. ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయని మంత్రి నమ్ముతున్నారు. ఈ మార్గంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా లేవంటున్నారు.
Google Maps - USO: గ్రీస్ సముద్రంలో వింత వస్తువు.. అదేంటి?
మొత్తంగా ఈ హైవే పూర్తవ్వకముందే... నెటిజన్లను ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించి ఇదివరకు నార్వేకి చెందిన దౌత్యవేత్త, మాజీ రాజకీయ నేత ఎరిక్ సోల్హెమ్... కర్ణాటకలోని ఉడిపిలో రోడ్డును ఫొటోలు తీసి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రపంచంలోనే అందమైన సైక్లింగ్ రూట్ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇలా ఈ హైవే.. అందర్నీ ఆకర్షిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.