యాప్నగరం

China Covid 19: చైనాలో అరాచకం.. మనుషుల్ని టేపులతో కట్టేసి దారుణం

అభివృద్ధిలో దూసుకుపోతున్నట్లు చైనా గొప్పగా చెప్పుకుంటోంది. కరోనాని తాము కంట్రోల్ చేసినట్లుగా మరే దేశమూ చెయ్యలేకపోతోందని బిల్డప్ ఇస్తోంది. కానీ ఆ దేశంలో జరుగుతున్న అరాచకాలు అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తున్నాయి. వాటిని చూస్తే... వామ్మో అనిపించకమానదు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కరోనా పేషెంట్‌పై చైనా పోలీసులు చూపుతున్న ప్రతాపం చూస్తే... ఇదేనా అభివృద్ధి అంటే అనిపించకమానదు. ఆ వీడియో మనం మిస్సవకుండా చూద్దాం.

Authored byKrishna Kumar | Samayam Telugu 13 May 2022, 12:23 pm
చైనా.. వుహాన్‌లో మొదటిసారి కరోనా వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చెయ్యడానికి ఆ దేశం రకరకాల హింసాత్మక పద్ధతుల్ని పాటించింది. మనుషుల్ని జంతువుల కంటే హీనంగా చూసింది. వాళ్లను కిరాతకంగా బంధించి నరకం చూపించింది. ఏదో ఒకటి చేసి... వుహాన్‌లో కరోనాను కంట్రోల్ చేసిన చైనా... తాజాగా మరోసారి షాంఘై, బీజింగ్‌లో కరోనా వ్యాపించడంతో... దాన్ని కంట్రోల్ చెయ్యడానికి... అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. పరిస్థితి ఎలా ఉందంటే... కరోనా వచ్చి చనిపోయే కంటే... ప్రభుత్వం పెట్టే నరకం భరించలేక చనిపోవడం బెటర్ అనుకునేలా చేస్తోంది డ్రాగన్ దేశం. (china covid rules)
Samayam Telugu చైనాలో అరాచకం.. మనుషుల్ని టేపులతో కట్టేసి దారుణం (image credit - twitter - @ChinaUncensored)


తాజాగా కరోనా సోకిన వ్యక్తి (corona patient)ని పోలీసులు టేప్‌తో కట్టేసిన వీడియో సోషల్ మీడియాకి ఎక్కింది. కనీసం పేషెంట్ అని కూడా చూడకుండా... చైనా పోలీసులు... అతనికి కాళ్ల నుంచి భుజం వరకూ టేప్ చుట్టేశారు. ఎటూ కదలకుండా శిలలా చేసేశారు. జనరల్‌గా కరోనా సోకిన వారు నీరసించిపోతారు. అలాంటి వారికి మానసికంగా ధైర్యం ఇవ్వాలి. చైనా పోలీసులు మాత్రం... ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. కరోనా కంటే వీళ్ల అరాచకం ఎక్కువైపోయిందనే వాదన వినిపిస్తోంది.

ఆ వీడియోని ఇక్కడ చూడండి (viral video)

చూశారా... భయంకరంగా ఉంది కదూ. కొన్ని రోజుల కిందట కరోనా టెస్ట్ చెయ్యడం కోసం ఓ మహిళపై ఇలాగే దారుణంగా వ్యవహరించారు వైద్య సిబ్బంది. ఆ మహిళను నేలపై పడుకోబెట్టి... ఆమెపై కూర్చొని టెస్ట్ చేయించాడు ఓ మగ హెల్త్ వర్కర్. టెస్ట్ చెయ్యడానికి ఇంత అరాచకం అవసరమా అని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు.
viral video: వామ్మో.. వధూవరులకు మంటలు.. పెళ్లిలో ఏం జరిగింది?
ఆ వీడియోని ఇక్కడ చూడండి
viral video: అలియాభట్‌ లాంటి అమ్మాయి.. కన్‌ఫ్యూజ్ అవుతున్న నెటిజన్లు
కేసులు తక్కువే (china covid cases):
నిజానికి చైనాలో ఇప్పుడు కరోనా చాలా తక్కువే ఉంది. నిన్న కొత్తగా 331 కేసులు వచ్చాయి. ఇద్దరు చనిపోయారు. యాక్టివ్ కేసులు 6,944 ఉన్నాయి. మన ఇండియాతో పోల్చితే ఇవి చాలా తక్కువే. ఇండియాలో రోజూ 3వేల దాకా కొత్త కేసులు వస్తున్నాయి. యాక్టివ్ కేసులు 18,604 ఉన్నాయి. అయినా మన దేశంలో ఏమాత్రం కఠినంగా వ్యవహరించట్లేదు. ఎంతో స్వేచ్ఛ ఇస్తున్నారు. చైనా పాలకులు మాత్రం కఠిన కండీషన్లతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.
జిన్‌పింగ్‌కు వింత వ్యాధి.. ఏ క్షణమైనా మెదడులోని రక్తనాళాలు చిట్లిపోతాయా?
ఒక్క కేసు కూడా లేకుండా... కోవిడ్ జీరో అవ్వాలన్నది చైనా పాలకుల ఉద్దేశం. అది జరగదు. ఎందుకంటే... జ్వరాలు, జలుబుల వంటిదే కరోనా కూడా. అవన్నీ వేల ఏళ్లుగా వస్తూనే ఉన్నాయి. వాటిలో భాగమైన కరోనా కూడా పూర్తిగా పోవడం అనేది జరగదు. సూక్ష్మజీవుల్ని పూర్తిగా అంతం చేయడం మనకు సాధ్యం కాదు. ఈ విషయాలు తెలిసి కూడా చైనా ఇంత హీనంగా వ్యవహరిస్తుండటం విమర్శలకు దారితీస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.