యాప్నగరం

దెయ్యాన్ని చూపిస్తే రూ.50 వేలు నజరానా, కలెక్టర్ సంచలన ప్రకటన

మీకు దెయ్యం కనిపిస్తే వెంటనే ఫొటో లేదా వీడియో తీసి కలెక్టర్‌కు పంపించండి. అది నిజమని తేలితే రూ.50 వేలు గెలుచుకోవచ్చు. మరి, దెయ్యాలు ఎక్కడ దొరుకుతాయి??

Samayam Telugu 24 Oct 2019, 4:09 pm
మీరు దెయ్యాన్ని చూశారా? ఒక వేళ చూసి ఉంటే ఆధారాలతో సహా చూపిస్తే రూ.50 వేలు నగదు బహుమతి గెలుచుకోవచ్చు. స్వయానా జిల్లా కలెక్టరే ఈ ప్రకటన చేశారు. దెయ్యాలు, పిశాచాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై స్పందించిన కలెక్టర్.. ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆధారాలతో సహా వచ్చేవారికి ఆ బహుమతి ఇస్తామన్నారు.
Samayam Telugu GettyImages-1033846974


Also read:
కొడుకు పక్కలో శిశువు ఆత్మ.. భర్త తప్పిదంతో భార్య హడల్, చివరికి..

ఒడిశాలోని గంజాం జిల్లా కలెక్టర్ విజయ్ అమృత కులాంగే చేసిన ఈ ప్రకటన ఆ రాష్ట్రంలో చర్చనీయంగా మారింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎవరైనా దెయ్యాలు, భూతాలు ఉన్నాయని నిరూపిస్తే రూ.50 వేలు రివార్డు ఇస్తాను. స్వయంగా నా జేబు నుంచే ఆ డబ్బులు చెల్లిస్తా’’ అని తెలిపారు.

Also read:
తల్లి కళ్ల ముందే పిల్లల తలలు నరికి.. టీవీ ఎత్తుకెళ్లారు!

‘‘చేతబడులు చేస్తున్నారని, మనుషులకు దెయ్యం పట్టిందనే వివిధ కారణాలతో ప్రజలు.. ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. వారిని దారుణంగా హింసిస్తున్నారు. ఇలాంటి మూఢ విశ్వాసాలను నమ్మవద్దని చెబుతున్నాను. ఇలాంటివి అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ ప్రకటన చేశాను’’ అని తెలిపారు. కలెక్టర్ చేసిన ప్రకటనపై నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రయత్నం ఫలించాలని కోరుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.