Communal Harmony: Muslim Man Prints Daughter's Wedding Card With Hindu Gods
సలాం - నమస్తే.. ముస్లిం పెళ్లి శుభలేఖపై హిందు దేవుళ్లు.. దటీజ్ ఇండియా!
మతవిద్వేషాలను రెచ్చగొట్టే శక్తులకు చెంపపెట్టులాంటి ఘటన ఇది. అల్లర్ల నేపథ్యంలో ఓ ముస్లిం వ్యక్తి తన కూతురి పెళ్లి శుభలేఖలపై హిందూ దేవుళ్లను ముద్రించి సోదరభావం చాటారు. ఈ ఆర్టికల్ను షేర్ చేసుకుని ఈ మంచిని అందరికీ పంచుదామా!!
Samayam Telugu29 Feb 2020, 9:23 pm
ఢిల్లీ అల్లర్లు.. కేవలం రాజకీయ, ఆకతాయిల చర్యేనని, అది కేవలం సముద్రంలో వర్షపు చినుకు మాత్రమేనని.. అలాంటి అల్లర్లు మన ప్రజల మధ్య ఉన్న సోదరభావాన్ని దెబ్బతీయలేదని చెప్పేందుకు ఈ శుభలేఖే నిదర్శనం. ఢిల్లీలో అశాంతి నెలకున్న ఈ సమయంలో ఓ ముస్లిం వ్యక్తి తన కుమార్తె పెళ్లి ద్వారా ఓ మంచి సందేశాన్ని అందించాడు. శుభలేఖపై హిందూ దేవుళ్లను కూడా ముద్రించి.. ఐక్యతను చాటాడు. మతాలు వేరైనా మనమంతా భరతమాత బిడ్డలమని చాటాడు.
గణపతి, రాధాకృష్ణుల బొమ్మలతో శుభలేఖ
సాధారణంగా ముస్లింల శుభలేఖలు నెలవంకలో నక్షత్రంతో ఉంటాయి. అయితే, ఈ శుభలేఖను చూస్తే.. హిందువుల శుభలేఖే అనిపిస్తుంది. ఒక వైపు నెలవంక నక్షత్రం.. మరోవైపు వినాయకుడి బొమ్మ. లోపల రాధాకృష్ణుల బొమ్మతో చూడముచ్చటగా ఆ శుఖలేఖను రూపొందించారు. వీటిలో కొన్నింటిని హిందీలో ముద్రించగా, మరికొన్ని ఉర్దులో ముంద్రించారు. తమ బంధువుల్లో చాలామందికి హిందీ చదవడం రాదని, అందుకే మిగతా శుభలేఖలను ఉర్దులో ముద్రించానని వధువు తండ్రి మహ్మద్ సరాఫత్ తెలిపాడు.
హిందూ ముస్లింల సోదరభావాన్ని తెలిపేందుకే..
ఈ సందర్భంగా సరాఫత్ మాట్లాడుతూ.. ‘‘హిందూ-ముస్లిం స్నేహాన్ని తెలిపేందుకు ఇదే మంచి మార్గం అనిపించింది. మత విద్వేషాలు పుట్టుకొస్తున్న ఈ తరుణంలో ఈ ప్రయత్నం చాలా అవసరం అనిపించింది. ఈ శుభలేఖ చూడగానే నా స్నేహితులు కూడా సానుకూలంగా స్పందించారు’’ అని తెలిపారు. అయితే, సరాఫత్ మాత్రమే కాదు.. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చాలామంది హిందూ-ముస్లింలు తమ సోదర భావాన్ని చాటుతున్నారు. స్వార్థపరులకు అవకాశం ఇవ్వొద్దని, ప్రతికూల శక్తుల మాటలను నమ్మి హింసకు పాల్పడవద్దని చాటుతున్నారు. ఇందుకు ఈ కింది ఘటనలే నిదర్శనం. మనం ఇప్పటివరకు ఢిల్లీ అల్లర్లు గురించి తెలుసుకున్నాం. అదే, సమయంలో చోటుచేసుకున్న కొన్ని ఘటనలను చూస్తే.. మీ గుండె గర్వంతో ఉప్పొంగుతుంది.
అల్లర్లు లెక్క చేయకుండా ఒక్కటయ్యారు..
ఫిబ్రవరి 25న అల్లర్లు చోటుచేసుకున్న రోజు.. అశోక్ నగర్లో కొన్ని ఆస్తులు బుగ్గయిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాతి రోజు అక్కడి భిన్నమైన పరిస్థతి కనిపించింది. అదే ప్రాంతంలో హిందూ ముస్లింలు కలిసి కాల్చి బుగ్గిచేసిన పవిత్ర గ్రంథాలను కాగితాలను ఏరుతూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ముస్లిం కుటుంబానికి రక్షణ కల్పించిన హిందువులు
యమునా విహార్కు చెందిన స్థానిక బీజేపీ కౌన్సిలర్ అల్లరిమూక దాడుల నుంచి ముస్లిం కుటుంబాన్ని రక్షించారు. ఇంటిని తగలబెట్టేందుకు వచ్చిన మూకను తరిమికొట్టి.. వారికి ఆశ్రయమించ్చారు. అప్పటికే ఆ అల్లరిమూక వారి కారు, బైకును తగలబెట్టారు. అలాగే, హిందూ ముస్లింలు తమ ఐక్యత చాటేందుకు ఇటీవల సంయుక్తంగా ర్యాలీ కూడా నిర్వహించారు. తమ ప్రాంతంలో నెలకొన్న మత విద్వేషాలను తరిమికొట్టేందుకు అంతా ఒక్కటయ్యారు. మరో ఘటనలో ఓ ముస్లిం కుటుంబం రాళ్ల దాడిలో గాయపడిన ఓ హిందూ బాలుడికిని రక్షించి మానవత్వాన్ని చాటారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలను కింది ట్వీట్లలో చూడండి. ఇది సరిపోదా.. మన ఇండియా గొప్పతనం చెప్పేందుకు!!
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.