యాప్నగరం

చేతిలో చెయ్యేసి.. కరోనాతో ఒకేసారి ప్రాణాలొదిలిన జంట

జీవితాంతం కలిసి ఉంటామని ప్రమాణం చేశారు. 53 ఏళ్లు ఎంతో అన్యోన్యంగా జీవించారు. ఒకరి చేతిని ఒకరు పట్టుకుని తుదిశ్వాస విడిచారు.

Samayam Telugu 2 Jul 2020, 12:17 pm
రోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. వైరస్ ఎందరో జీవితాల్లో విషాదం నింపుతోంది. కోవిడ్-19తో ఆస్పత్రిపాలైన ఈ వృద్ధ జంట చివరి క్షణాలు గురించి తెలిస్తే గుండె బరువెక్కుతుంది. ఎంతటివారికైనా కన్నీళ్లు రాకమానవు. జీవితాంతం కలిసే ఉంటామని ప్రమానం చేసిన ఆ జంట.. మరణంలో కూడా కలిసే ఉన్నారు. చేతిలో చెయ్యేసి ఒకే రోజు.. ఒకరితర్వాత ఒకరు ప్రాణాలు వదిలారు.
Samayam Telugu photo: Twitter


అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన బెట్టీ టర్ప్‌లే (80), కుర్టీస్ టర్ప్‌లే(79) కొద్ది రోజుల కిందట కరోనా వైరస్‌కు గురయ్యారు. దీంతో వారికి హాస్పిటల్‌లో చికిత్స అందించారు. 53 ఏళ్లుగా కలిసి జీవిస్తున్నవారి జీవితం ఈ విధంగా ముగుస్తుందని వారు ఏ రోజు భావించలేదు. ఇద్దరూ ఒకరి కోసం ఒకరు వ్యాధిని జయించేందుకే ప్రయత్నించారు. చివరికి వారిద్దరికి ఆశలు సన్నగిల్లాయి. ఇక బతకడం కష్టమని అర్థమైపోయింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది వారి బెడ్స్‌ను పక్క పక్కనే ఏర్పాటు చేశారు. ఆఖరి క్షణాల్లో వారి నోటి నుంచి మాట కూడా రాలేదు. ఇద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని కళ్లతోనే మాట్లాడుకున్నారు. భార్య బెట్టీ కన్నుమూసిన గంటలోపే భర్త కుర్టీస్ కూడా చనిపోయాడు. క్షణాల వ్యవధిలో ఇద్దరూ కలిసే స్వర్గానికి వెళ్లారు.

Also Read: బెడ్రూమ్‌లో బావి.. ఫ్లోర్ విరిగి 30 అడుగుల గోతిలో పడ్డ వ్యక్తి, చివరికి..

ఈ సందర్భంగా వారి కుమారుడు టిమ్ మాట్లాడుతూ.. ‘‘నాన్న బతికేందుకు చాలా ప్రయత్నించారు. ఎందుకంటే.. అమ్మ తప్పకుండా వైరస్‌ను జయించి ఆరోగ్యంతో కోలుకుంటుందని ఆయన భావించారు. ఆమె కోసం తాను కూడా ప్రాణాలతో ఉండాలని భావించారు. ఇక ఆమె బతకదని తెలిసిన తర్వాత.. ఆయన కూడా జీవితం మీద ఆశలు వదిలేసుకున్నారు కాబోలు. అమ్మ చనిపోయిన కొద్ది క్షణాల్లోనే బాధను తట్టుకోలేక కన్నుమూశారు’’ అని తెలిపాడు.

Also Read: 26 ఏళ్లుగా బయటకెళ్లని కూతురు.. పిల్లి కళేబరాలతో నిద్ర, తల్లి ప్రేమ ఫలితం!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.