యాప్నగరం

ఆక్సిజన్ వదిలే ఏకైక జీవి ఆవు.. సీఎం షాకింగ్ కామెంట్స్!

మీకు తెలుసా? సమస్త జీవుల్లో ఆక్సిజన్ పీల్చి.. తిరిగి ఆక్సిజన్ వదిలే ఏకైక జీవి ఆవు మాత్రమేనట. పరిశోధకులకు సైతం చిక్కని ఆసక్తికర విషయాలు చెప్పిన సీఎం.

Samayam Telugu 26 Jul 2019, 4:18 pm
మన దేశంలో ఆవును దైవంగా భావిస్తారనే సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల ఆవులు సెలబ్రిటీలుగా మారిపోయాయి. రాజకీయాలన్ని ఇప్పుడు ‘ఆవు’ చుట్టూనే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కూడా ఆవు గొప్పతనం చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయమయ్యాయి.
Samayam Telugu C4718AD6-DF11-4069-A885-5FADF1DCF448


ఇటీవల డెహ్రాడూన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆవు ప్రత్యేకతలను చెప్పారు. ‘‘ఆక్సిజన్ పీల్చుకుని, ఆక్సిజన్ వదిలిపెట్టే ఏకైక జీవి ఆవు మాత్రమే. అంతేకాదు, ఆవు పాలలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి’’ అని తెలిపారు. ఆయన అంతటితో ఆగకుండా మరో ఆసక్తికర విషయం తెలిపారు. ‘‘ఆవులకు రోజూ మర్దనా చేస్తే శ్వాస సంబంధిత సమస్యలు నయమవుతాయి’’ అని ఉపదేశించారు. క్షయ వ్యాధి కూడా నయమవుతుందని తెలిపారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దావనంలా పాకాయి. దీంతో నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. సీఎంగారు పరిశోధకులకు సైతం చిక్కని గొప్ప విషయాలు సెలవిచ్చారంటూ ట్రోల్ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.