యాప్నగరం

ఇంటి పైకెక్కిన మొసలి.. కర్ణాటక వరదల్లో సిత్రం!

Karnataka Floods | వరదలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. నీళ్లతోపాటు మొసళ్లు, విషసర్పాలు సైతం జనావాసాల్లోకి వస్తున్నాయి.

Samayam Telugu 12 Aug 2019, 7:03 pm
భారీ వరదలు కేరళ, కర్ణాటక రాష్ట్రాలను భయకంపితులను చేస్తున్నాయి. ఒక వైపు పీకల్లోతు నీరు ముంచెత్తుతుంటే.. మరోవైపు మొసళ్లు, విష సర్పాలు ప్రాణసంకటంగా మారాయి. తాజాగా కర్ణాటకలోని బెల్గమ్‌లో సహాయక చర్యల్లో పాల్గొన్న రెస్క్యూ సిబ్బందికి పూర్తిగా నీటిలో మునిగిన ఇంటి పైకప్పుపై ఓ మొసలి నోరు తెరిచి కనిపించింది.
Samayam Telugu 70633301


దీంతో షాకైన సిబ్బంది దాన్ని వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటం వల్ల తీర ప్రాంతాల్లోని అడవుల్లో ఉండే జంతువులు సైతం కొట్టుకుని జనవాసాల్లోకి వస్తున్నాయి. గతేడాది కేరళ వరదల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. వరద తగ్గిన తర్వాత ఇళ్లల్లో అనేక విష సర్పాలు బయటపడ్డాయి.

ఇటీవల గుజరాత్‌లోని వడోదరలో సైతం వరద నీటితోపాటు మొసళ్లు కొట్టుకొచ్చాయి. అంతా చూస్తుండగానే ఓ మొసలి కుక్కపై దాడి చేసింది. దీంతో వరద నీటి నుంచి నడవాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఇన్ని ప్రతికూలతల్లో కూడా అధికారులు నిస్వార్థంగా పనిచేస్తూ బాధితులను సురక్షిత ప్రాంతానికి తరలించడం గమనార్హం.
వీడియో:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.